రాజన్న ఆలయ విస్తరణ పనులు జరుగుతున్నప్పటికీ స్వామి వారి ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నాం. ఆలయ ప్రధాన గోపురం ఎదుట యాగశాలలో ప్రత్యేక పూజలు చేస్తాం. ఈసారి శివార్చన వేదికపై స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహించబోతున్నాం. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పార్వతీరాజరాజేశ్వరల కల్యాణోత్సవం వీక్షించవచ్చు.
– చంద్రగిరి శరత్శర్మ,
ఆలయ ప్రధాన అర్చకుడు
రాజన్న కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈసారి శివార్చన వేదికపై కల్యాణోత్సవం నిర్వహిస్తున్నాం. ఇక్కడ భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నాం. తాగునీరు, శామియానాలు, మరుగుదొడ్లు, మజ్జిగ ప్యాకెట్లు, ఉచిత అన్నదానం, విద్యుత్ లైట్లు, పార్కింగ్, భక్తులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకు భద్రత కల్పించేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. – రమాదేవి, ఆలయ ఈవో


