
గ్రామ కమిటీలతో నేర నియంత్రణ
● జిల్లా సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్
కోనరావుపేట(వేములవాడ): నేరాల నియంత్రణకు గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ పేర్కొన్నారు. కనగర్తిలో మానేరు స్వచ్ఛందసంస్థ ఆధ్వర్యంలో గురువారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఒక్కసారి కేసులో ఇరుక్కుంటే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. బాల్యవివాహాలను ప్రోత్సహించిన వారికి రెండేళ్ల వరకు జైలు, జరిమానా ఉంటుందని హెచ్చరించారు. లోక్అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్ మాట్లాడుతూ సివిల్ కేసులను లోక్అదాలత్లో పరిష్కరించుకుంటే.. కేసు కొట్టేయడంతోపాటు కోర్టు ఫీజు వాపస్ వస్తుందని తెలిపారు. కోనరావుపేట ఎస్సై ప్రశాంత్రెడ్డి, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాస్రావు, న్యాయవాధులు విజయ్, ఆంజనేయులు, క్రాంతికుమార్, సింగిల్విండో వైస్చైర్మన్ భూంరెడ్డి, కార్యదర్శి కవితారెడ్డి, మాజీ సర్పంచ్ బాపురెడ్డి, ఉపసర్పంచ్ దేవరాజు పాల్గొన్నారు.
వేములవాడ సబ్జడ్జిగా అజయ్కుమార్
వేములవాడ: వేములవాడ సబ్జడ్జిగా అజ య్కుమార్ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటి వరకు ఇన్చార్జీగా లక్ష్మణాచారి వ్యవహరించారు. ఆయన స్థానంలో అజయ్కుమార్ నియమితులయ్యారు.
‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని ఇందిర మ్మ ఇళ్ల పథకం పైలట్ గ్రామం రాళ్లపేటలో బేస్మెంట్ స్థాయికి ఇంటి నిర్మాణం పూర్తిచేసిన లబ్ధిదారుల ఖాతాల్లోకి గురువారం నగదు జమైనట్లు ఎంపీడీవో కె.లక్ష్మీనారాయణ తెలిపారు. రాళ్లపేటలో 102 మందిని ఎంపిక చేయగా 52 మంది పనులు ప్రారంభించారని.. 9 మంది బేస్మెంట్ వరకు పూర్తిచేయగా వారి ఖాతాల్లో మొదటి విడతగా రూ.లక్ష చొప్పున జమైనట్లు తెలిపారు.
ఎయిర్ఫోర్స్లో ఖాళీలు
సిరిసిల్లకల్చరల్: ఇండియన్ ఎయిర్ఫోర్స్ సంగీత విభాగంలో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసినట్లు జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి అజ్మీర రాందాస్ తెలిపారు. ఈనెల 21 నుంచి వచ్చే నెల 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. htt p://agnipathvayu.cdac.in పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ప్రీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు ప్రొవిజన ల్ అడ్మిట్కార్డు పొందే వీలుంటుందని తెలిపా రు. బెంగళూరు, న్యూఢిల్లీలో జరిగే ర్యాలీలో పాల్గొని సంగీత విభాగంలోని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సామూహిక సీమంతాలు, అక్షరాభ్యాసం
సిరిసిల్లటౌన్: పోషణ పక్షోత్సవాల్లో భాగంగా గురువారం సుభాష్నగర్ సెక్టార్ పరిధిలోని పెద్దూరు అంగన్వాడీ సెంటర్లో పోషణ జాతర, అన్నప్రాసన, సామూహిక సీమంతా లు, అక్షరాభ్యాసం నిర్వహించారు. డీడబ్ల్యూవో లక్ష్మీరాజం మాట్లాడుతూ గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. గర్భవతి అని తెలిసినప్పటి నుంచే అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. సీడీపీవో ఉమారాణి, సూపర్వైజర్ దివ్య, అంగన్వాడీ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎదురుగట్ల మమత, టీ చర్లు మంజుల, అన్నపూర్ణ, శాంత, నాగలక్ష్మి, విజ య, పద్మ, సునీత, రేణుక, రాధ, చిట్టి, పుష్పలత, జ్యోతి, సురేఖ, మహేశ్వరి పాల్గొన్నారు.
ఆస్పత్రిలో ఫైర్సేఫ్టీ అవసరం
సిరిసిల్లక్రైం: జన రద్దీ అధికంగా ఉండే ఆస్పత్రిలో ఫైర్సేఫ్టీ అవసరమని సిరిసిల్ల స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేందర్ స్పష్టం చేశారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్లలోని పలు ఆస్పత్రుల్లో గురువారం ఫైర్సేఫ్టీపై అవగాహన కల్పించారు. అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగితే వాటి నుంచి తప్పించుకునేందుకు అవసరమైన అత్యవసర ద్వారాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

గ్రామ కమిటీలతో నేర నియంత్రణ