కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఒంగోలు: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ్‌ (కేజీబీవీ) పాఠశాలల్లో 6వ తరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరంతో పాటు 7,8,9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేసేందుకు అర్హులైనవారి నుంచి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27 నుంచి ఏప్రిల్‌ 20 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. అనాథలు, బడి బయట పిల్లలు, బడిమానేసిన వారు, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారీట, బీపీఎల్‌, ఆర్ఫన్స్‌ అండ్‌ సెమీ ఆర్ఫన్స్‌ బాలికలే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోనికి తీసుకుంటామని.. దరఖాస్తులను హెచ్‌టీటీపీఎస్‌://ఏపీకేజీపీబీఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌.ఇన్‌ అనే వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చన్నారు.

ఎంపిౖకైన విద్యార్థినులకు వారు నమోదు చేసిన సెల్‌ఫోన్‌ నెంబర్‌కు మెసేజ్‌ పంపిస్తామని వివరించారు. అంతే కాకుండా సంబంధిత పాఠశాల నోటీసు బోర్డులో కూడా ఉంచుతామన్నారు.

Read latest Prakasam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top