మాతృమరణాలను నివారించాలి

డీఎంహెచ్‌ఓ రాజ్యలక్ష్మి

ఒంగోలు అర్బన్‌: మాతృమరణాలను నివారించాలని ఆ మేరకు హైరిస్క్‌ గర్భిణులను పర్యవేక్షిస్తూ తగిన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ రాజ్యలక్ష్మి వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో మాతృమరణాలపై సమీక్ష నిర్వహించారు. దీనిలో డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రసవాలు ఆస్పత్రుల్లో జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణి అయినప్పటి నుంచి ప్రసవం అయి తల్లీబిడ్డ క్షేమంగా ఉండే వరకు సంబంధిత సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. గర్భిణులు క్రమం తప్పకుండా వైద్యుల సూచనల మేరకు చికిత్స, మందులు వాడాలన్నారు. సమావేశంలో గైనకాలజిస్ట్‌లు, బ్లడ్‌బ్యాంక్‌ నిర్వాహకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Prakasam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top