‘బాబుని సీఎం చేయాలని గవర్నర్‌కి లేఖ రాస్తారేమో’

YSRCP MLA Ambati Rambabu Slams Nimmagadda Ramesh Kumar - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు నిమ్మగడ్డ తీరును ఎండగడుతూ.. ట్వీట్‌ చేశారు. ‘‘ఎస్‌ఈసీ వ్యవహార శైలి చూస్తే.. తక్షణమే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా తొలగించి.. ఆ స్థానంలో చంద్రబాబుని నియమించవలసిందిగా నిమ్మగడ్డ గవర్నర్‌కి లెటర్‌ రాసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. పిచ్చి ముదిరింది’’ అంటూ అంబటి రాంబాబు ట్వీట్‌ చేశారు. 
(చదవండి: మూడేళ్లు నిద్రపోయి.. ఇప్పుడెందుకు తొందర..!)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top