‘అప్పుడు అంతు చూస్తా, తోక కోస్తా అన్నారు’ | Vijayasai Reddy Satires On Opposition Leader Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘అప్పుడు అంతు చూస్తా, తోక కోస్తా అన్నారు’

Oct 20 2020 9:25 AM | Updated on Oct 20 2020 12:33 PM

Vijayasai Reddy Satires On Opposition Leader Chandrababu Naidu - Sakshi

పవర్‌ పోయాక పార్టీ పదవులు విదిలిస్తే ఎవరూ నమ్మరు చంద్రబాబు. విస్తరిలో వడ్డించేటప్పుడే ఆకలి మంటను గుర్తించాలి, వాటిని ఎత్తేసేటప్పుడు కాదు

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉండగా బీసీల అభివృద్ధిని మరచిన బాబు ప్రతిపక్షంలో కూర్చుని వారిని ఉద్ధరిస్తానని బీరాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో.. ‘అధికారంతో విర్రవీగిన రోజుల్లో అంతు చూస్తా, తోక కోస్తా అని బీసీలను.. చంద్రబాబు ఈసడించిన వీడియోలు సోషల్‌మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి. పవర్‌ పోయాక పార్టీ పదవులు విదిలిస్తే ఎవరూ నమ్మరు చంద్రబాబు. విస్తరిలో వడ్డించేటప్పుడే ఆకలి మంటను గుర్తించాలి, వాటిని ఎత్తేసేటప్పుడు కాదు’అని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.
(చదవండి: అవినీతి నేతకు అధ్యక్ష పదవా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement