
ఈ పిచ్చి నా.. కొ.. త్వరలోనే జైలుకెళ్లి చిప్పకూడు తింటాడు
ఎర్రిపప్ప కారుమూరి అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చో
కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ అసభ్య దూషణలు
యలమంచిలి: బూతులు తిట్టడంలో టీడీపీ నేతలను మించిపోయారు.. కేంద్ర సహాయ మంత్రి, నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాసవర్మ. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలిలో ఆదివారం పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్న ఆయన తర్వాత జరిగిన సభలో మహిళల ఎదుటే వైఎస్సార్సీపీ నేతలపై తిట్ల దండకం ఎత్తుకున్నారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై శ్రీనివాసవర్మ దూషణలకు దిగారు.
‘ఎర్రిపప్ప కారుమూరి తణుకు మున్సిపాలిటీలో వందల కోట్లు టీడీఆర్ నిధులు స్కామ్ చేశాడు... ఈ పిచ్చి నా..కొ.. త్వరలోనే జైలుకెళ్లి చిప్ప కూడు తింటాడు’ అంటూ అసభ్య పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఎర్రిపప్ప కారుమూరి.. నీ నాలుక కోసేస్తాం.. కాళ్లు చేతులు నరికేస్తాం.. అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చో..’ అంటూ ఇష్టానుసారం మాట్లాడారు.
అక్కడితో ఆగకుండా వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, సీదిరి అప్పలరాజుపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీళ్లంతా అవినీతికి మారుపేరని, మనుషుల రక్తం తాగేసేలా ఉంటారని శ్రీనివాసవర్మ తన నోటికి పనిచెప్పారు.