Telangana BJP President Bandi Sanjay Reacts On Karnataka Assembly Results - Sakshi
Sakshi News home page

Bandi Sanjay: ఒక్క రాష్ట్రంలో గెలవగానే రెచ్చిపోతున్నారు.. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవాలని కేసీఆర్ కోరుకున్నారు

May 13 2023 5:48 PM | Updated on May 13 2023 5:55 PM

Telangana BJP President Bandi Sanjay On Karnataka Assembly Results - Sakshi

సాక్షి, కరీంనగర్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. కన్నడనాట హిందూ వ్యతిరేక శక్తులన్నీ కలిసి బీజేపీ విజయాన్ని అడ్డుకున్నాయని వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రంలో గెలవగానే తెలంగాణలో కూడా గెలుస్తామని కాంగ్రెస్ నేతలు బీరాలు పలుకుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  ఒక్క రాష్ట్రంలో గెలిస్తే రెచ్చిపోతున్నారని సెటైర్లు వేశారు. కేసీఆర్ కర్ణాటకలో కాంగ్రెస్ గెలవాలని కోరుకున్నారని, జేడీఎస్ కామ్ అవ్వడానికి కారణం కూడా ఆయనే అని ఆరోపించారు.

'కర్నాటక ఎన్నికలకు ఇక్కడి బీఆర్ఎస్ డబ్బులు పంపింది. ఒక వర్గం కోసం పనిచేసే పార్టీలన్నీ ఏకమయ్యాయి. తెలంగాణాలో మైనారిటీ సంతుష్ఠ రాజకీయాలు పనిచేయవు. ఇక్కడ ఉపఎన్నికల్లో ఏ విజయాలైతే బీజేపీని వరించాయో.. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లోనూ ఆ ఫలితాలే పునరావృతం కానున్నాయి.

తెలంగాణాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు అన్నీ ఏకమవుతాయి. మళ్ళీ దేశంలో మోదీ సర్కారే వస్తుంది.  తెలంగాణాలో ఆర్థికంగా, అన్ని రంగల్లోనూ ముందుకు వెళ్లాలంటే మోదీ నేతృత్వంలోని డబల్ ఇంజిన్ సర్కార్ అవసరం.' అని బండి సంజయ్ పేర్కొన్నారు.
చదవండి: కాంగ్రెస్‌ను గెలిపించిన ఆరు మంత్రాలివే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement