బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా.. | Telangana BJP MLA Etela Rajender Meets Amit Shah | Sakshi
Sakshi News home page

బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా..

Jun 19 2022 8:50 PM | Updated on Jun 19 2022 9:05 PM

Telangana BJP MLA Etela Rajender Meets Amit Shah - Sakshi

ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర ఆదివారం కలిశారు. ఈ మేరకు అమిత్‌ షా నుంచి పిలుపు రావడంతో ఢిల్లీ వెళ్లిన ఈటల.. ఈరోజు కలిసి తెలంగాణ రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, పార్టీ స్థితిగతులను వివరించారు. బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలను ఈటల వివరించారు.

దీనిలో భాగంగా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని అమిత్‌ షా సూచించారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ తన సేవలను ఉపయోగించుకోవాలని అమిత్‌ షాకు ఈటల తెలిపారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్‌ బాధ్యతలు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement