‘ఒకే ఒక్కడు’తో బీజేపీ రెండో జాబితా  | Telangana BJP MLA Candidate Second List | Sakshi
Sakshi News home page

‘ఒకే ఒక్కడు’తో బీజేపీ రెండో జాబితా 

Oct 28 2023 1:42 AM | Updated on Oct 28 2023 1:42 AM

Telangana BJP MLA Candidate Second List - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఒకే ఒక్క అభ్యర్థి పేరుతో బీజేపీ శుక్రవారం రెండో జాబితా విడుదల చేసింది. మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి కుమారుడు ఏపీ మిథున్‌ రెడ్డి పేరును ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మిథున్‌రెడ్డితో కలిపి ఇప్పటివరకు 53 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. కాగా నవంబర్‌ 1 న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో భేటీ కానున్న బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ, మిగతా స్థానాలకు అభ్యర్థులను ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు సమాచారం.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement