Telangana Assembly Elections Today Minute To Minute Update..
రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్: హరీష్ రావు
- కాంగ్రెస్ పాలన అంతా చీకటిమయమే
- కరెంట్ కష్టాలు, నీటి కష్టాలను ప్రజలు మర్చిపోలేదు
- అర్ధరాత్రి రైతులను గోస పెట్టి పార్టీ కాంగ్రెస్
- కాంగ్రెస్ పార్టీ రైతులను ఏనాడు పట్టించుకోలేదు
- రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్
- నకిలీ విత్తనాలతో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
- కాంగ్రెస్ పార్టీ హయాంలో పెండింగ్ ప్రాజెక్టులుగా పేర్లు మారిపోయాయి.
- వ్యవసాయం దండగ అంటున్న నాయకునికి వారసుడు రేవంత్
- రైతు బంధు ఆపాలని కుట్ర
- కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా రైతు వ్యతిరేక పార్టీనే
- కాంగ్రెస్ గెలవగానే కర్ణాటకలో రైతు బంధు బంద్ అయింది
ముగిసిన మోదీ రోడ్ షో
- రోడ్ షోలో కాచిగూడ చేరుకున్న ప్రధాని మోదీ
- ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వరకు జరిగిన ప్రధాని మోదీ రోడ్ షో
- సావర్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన మోడీ
- రాత్రి 7.30 నుంచి 7.40 వరకు గురుద్వారా లో ప్రధాని మోడీ ప్రార్థనలు
- కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా రానున్న ప్రధాని మోదీ
హైదరాబాద్లో ప్రారంభమైన మోదీ రోడ్ షో
- చిక్కడపల్లి నారాయణగూడ మీదుగా సాగుతున్న రోడ్ షో
- ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వరకు 2.5 కిలోమీటర్లు రోడ్ షో
- ప్రధాని వెంట వాహనంపై కిషన్రెడ్డి, లక్ష్మణ్
- ర్యాలీలో పాల్గొన్న 24మంది ఎమ్మెల్యే అభ్యర్థులు
- భవనాలపై నుంచి మోదీకి అభివాదం చేస్తున్న ప్రజలు
- మోదీపై పూల వర్షం కురిపిస్తున్న అభిమానులు
సంగారెడ్డిలో కేసీఆర్ కామెంట్స్
- ఓటు మన తలరాతను మారుస్తుంది
- తెలంగాణలో పదేళ్లలో జరిగిన అభివృద్ధి చూడండి
- ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం
- తెలంగాణ ఏర్పడిన తర్వాత కరెంటు, నీరు సరిగా ఇచ్చుకున్నాం
- ఉన్న తెలంగాణను ఊడగొట్టిదే కాంగ్రెస్
- 50 ఏళ్లకుపైగా మనం గోసపడ్డాం
- ఓటు సరిగ్గా వినియోగించుకోవాలని కోరుతున్నా
- గతంలో మంచి నీళ్లకు ఇబ్బంది పడ్డాం
- రైతుబంధుతో దుబారా అని కాంగ్రెస్ అంటోంది
- రైతుబంధు ఉండాలా వద్దా
హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ
- కాసేపట్లో హైదరాబాద్లో ప్రధాని మోదీ రోడ్ షో
- ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడ వరకూ ప్రధాని మోదీ రోడ్ షో
కొడంగల్ ఎన్నికల ప్రచార సభలో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి
- కొడంగల్ నాకు అస్థిత్వాన్ని ఇచ్చింది.. పోరాటాన్ని నేర్పింది
- మీరు అండగా ఉన్నంత వరకూ మోదీ, కేసీఆర్ ఎవరైనా కొట్లాడుతా
ప్రజల చెమట, రక్తంతో రాష్ట్రం ఏర్పడింది: ప్రియాంక గాంధీ
- చరిత్రలో ఫామ్హౌజ్ నుంచి పాలన చేసిన సీఎం మరొకరు ఉండరు
- రాష్ట్రంలో ప్రజలు అప్పులపాలయ్యారు
- దొరల తెలంగాణ బలపడింది.. ప్రజలు బలహీనులయ్యారు
- చైతన్యవంతులు కాకపోతే నష్టపోయేది మీరే
- ప్రజల ఆందోళనలు, పోరాటాలతో రాష్ట్రం ఏర్పడింది
- ప్రజల చెమట, రక్తంతో రాష్ట్రం ఏర్పడింది.
- కేసీఆర్ పదేళ్లలో అవినీతికి పాల్పడ్డారు
- తెలంగాణలో బీఆర్ఎస్ సంపన్నపార్టీ
- ప్రపంచంలోనే బీజేపీ అధిక సంపన్నమైన పార్టీ
- కేంద్రంలో అవసరమైనప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ మద్దతునిస్తుంది
- ల్యాండ్, శాండ్, మైన్ మాఫియాతో ప్రభుత్వం కూరుకుపోయింది
- మీ ఓటును వ్యర్థం చేసుకోకండి
- తెలంగాణ వికాసం కోసమే రేవంత్ నాతో ఉన్నారు
- మీ ఆశను నెరవేర్చేందుకు సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారు
- తెలంగాణ ఏర్పడితే మన ప్రభుత్వం వస్తుందని అంతా భావించారు
- కొడంగల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రియాంక గాంధీ
ఆందోల్ ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్
- రైతుబంధును కాంగ్రెస్ వాళ్లే ఆపేశారు
- కాంగ్రెస్ నేతలకు అసలు సిగ్గుందా?
- కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతోనే ఈసీ రైతు బంధు నిలిపేసింది
- రైతుబంధును ఆపేస్తే కాంగ్రెస్ వాళ్లకు కూడా నష్టమే
- రైతుబంధు తీసుకుంటున్న వాళ్లలో కాంగ్రెస్ వాళ్లు కూడా ఉన్నారు
- ధరణి ఉండాలా? వద్దా?
- ధరణిని తీసేయాలని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు
- ధరణిని తీసేస్తే మళ్లీ వచ్చేది దళారుల రాజ్యమే
- ధరణి స్థానంలో భూమాత తెస్తారట. అది భూమాత కాదు.. భూమేత
- రైతులను ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తారు?
- ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు
- ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు
- ఇందిరమ్మ రాజ్యంతోనే కదా తెలంగాణ నాశనమైంది
కరీంనగర్లో మోదీ కామెంట్స్
- ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు భారతదేశం
- తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ శుభాభినందనలు
- పోలింగ్ రోజు ప్రజలు కేసీఆర్కు సినిమా చూపిస్తారు
- తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయింది
- తెలగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది
- బీజేపీ ప్రభుత్వంలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తి సీఎం కానున్నారు
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాం
- బీజేపీ సర్కారు వస్తేనే తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయి
- మోదీ అంటే కేసీఆర్కు భయం
- మోదీ వస్తే ఎయిర్పోర్టుకు కూడా రాకుండా తప్పించుకునేవారు
- ప్రజలను దోచుకోవడమే బీఆర్ఎస్ నేతల పని
- మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తవుతుంది
- నీళ్లు, నిధులు నియామకాలు ఏమయ్యాయి?
- బీఆర్ఎస్ పాలనలో కష్టాలు, కన్నీళ్లు
- కేసీఆర్ కుటుంబ కోసమే తెలంగాణ ఏర్పడిందా?
- డిసెంబర్ 3 తర్వాత లిక్కర్ స్కాంపై దర్యాప్తు వేగవంతం చేస్తాం
- రైతులకు నీళ్లిచ్చేందుకు కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారు
- తెలంగాణలో నీటి ప్రాజెక్టులు బీఆర్ఎస్కు ఏటీఏంలా మారిపోయాయి
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సూట్ కేసుల ప్రభుత్వం వస్తుంది: కిషన్రెడ్డి
- తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రమాదకరం
- గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతున్నారు
- మోదీని అడ్డుకోవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి డ్రామా చేస్తున్నాయి
- కామారెడ్డిలో కేసీఆర్ను గెలిపించడానికి రేవంత్ పోటీ చేస్తున్నారు
- తెరవెనుక బీఆర్ఎస్, కాంగ్రెస్లు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు
- బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో పాతబస్తీ ఎందుకు అభివృద్ధి చేయలేదు?
- ఇన్నాళ్లు పాతబస్తీ యువతకు ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించలేదు
- ఒవైసీ కుటుంబం శాసిస్తే కేసీఆర్ ఏదైనా చేస్తారు
- పాతబస్తీకి మెట్రో వసతి ఎందుకు కల్పించలేకపోయారు
మరికాసేపట్లో హైదరాబాద్లో మోదీ రోడ్
- రోడ్ షోలో పాల్గొననున్న గ్రేటర్ పరిధిలోని 24 మంది బీజేపీ అభ్యర్థులు
- రెండున్నర కిలోమీటర్ల మేర సాగనున్న రోడ్ షో
- రోడ్ షోకు భారీ ఏర్పాట్లు
- ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ సావర్కర్ విగ్రహం వరకు సాగనున్న ప్రధాని రోడ్ షో
- ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదలనున్న ప్రధాని
- రోడ్ షో నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన కేంద్ర బలగాలు
- ఆర్టీసి క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వరకు ట్రాఫిక్ ఆంక్షలు
గద్వాల్లో ప్రియాంక కామెంట్స్
- ఎంత పేదవారైనా తమ పిల్లలను మంచి చదువులు చదివించాలనుకుంటారు
- తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయనుకున్నారు
- కానీ అది కలగానే ఉండిపోయింది
చెన్నూరులో కేటీఆర్ కామెంట్స్
- అయిదేళ్లలో చెన్నూరు రూపు రేఖలు మార్చిన సుమన్కు అభినందనలు
- రైతుబంధు వేస్తే కేసీఆర్ ప్రభుత్వం గెలుస్తుందని రేవంత్ రెడ్డి ఈసీకి ఉత్తరం రాసిండు
- ఈసీ రైతు బంధును ఆపేసింది
- రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బంధు ఉండదు
- 24 గంటల కరెంటు ఉండదు
- 10 హెచ్పీ మోటార్ చాలు
- 3 గంటల కరెంట్ చాలు అని రేవంత్రెడ్డి అంటాడు
- కర్ణాటక నుంచి వచ్చినోడు 5 గంటలు చాలు అంటాడు
- 30 తారీఖున ఓటు వేసే ముందు కరెంట్ కావాల్నా, కాంగ్రెస్ కావాల్నా ఆలోచించండి
- కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు
- కాంగ్రెస్కు కరెంటు గురించి అడిగే నైతిక హక్కు లేదు
- దరిద్రానికి నేస్తం హస్తం..అది నెత్తి మీద పెట్టుకుంటే భస్మం అయిపోతాం
రైతుబంధు ఉండాలంటే మళ్లీ బీఆర్ఎస్ రావాలి.. షాద్ నగర్ సభలో సీఎం కేసీఆర్
- చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించుకున్నాం
- కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నాం
- పార్టీల చరిత్ర చూసి ప్రజలు ఓటేయాలి
- అభ్యర్థులు ఎలాంటి వారో అన్నీ చూసి ఓటేయాలి
- కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ బాధలే
- అధికారంలోకి వచ్చాక పెన్షన్ రూ.5వేల వరుకు ఇస్తాం
- రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు
- రైతుబంధు ఉండాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి
కాంగ్రెస్లో చేరిన అశ్వద్ధామ రెడ్డి
- కాంగ్రెస్లో చేరిన టీఎస్ఆర్టీసీ జేఏసీ నాయకుడు అశ్వద్ధామ రెడ్డి.
- జైరాం రమేష్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిక
- కాంగ్రెస్కు మద్దతు పలికిన ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్
- ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన అశ్వద్ధామ రెడ్డి.
తెలంగాణలో కొత్త చరిత్ర లిఖించబోతున్నాం: మోదీ
- మహబూబాబాద్లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ
- ప్రధాని మోదీ కామెంట్స్..
- తెలంగాణ కొత్త చరిత్ర లిఖించబోతుంది.
- బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీని సీఎం చేస్తాం.
- కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణను నాశనం చేశాయి.
- తెలంగాణలో మొదటిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోంది.
- బీజేపీతో ఎలాగైన దోస్తీ చేయాలని కేసీఆర్ ఢిల్లీకి వచ్చారు.
- నేను తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్దంగా ఉండదలచుకోలేదు.
- బీఆర్ఎస్ను బీజేపీ ఎప్పుడూ దగ్గరకు రానివ్వదు.
- ఎన్డీయేలో చేర్చుకోవట్లేదని బీఆర్ఎస్ నేతలు నన్ను తిట్టడం మొదలుపెట్టారు.
- మా దరిదాపుల్లోకి కూడా బీఆర్ఎస్ను రానివ్వం, ఇది మోదీ గ్యారంటీ.
- తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు గుడ్బై చెప్పబోతున్నారు.
- బీజేపీ ఇచ్చే గ్యారంటీ తప్పకుండా అమలవుతుంది.
- తెలంగాణను కేసీఆర్ మూఢనమ్మకాల రాష్ట్రంగా మార్చారు.
- మూఢనమ్మకాలతో సచివాలయాన్ని నాశనం చేశారు.
- కాంగ్రెస్, బీఆర్ఎస్.. దళితులు, బీసీలను మోసం చేశారు.
- తెలంగాణకు ఫామ్హౌస్ సీఎం అవసరం లేదు.
- బీఆర్ఎస్లో స్కామ్లు చేసిన వారిని జైలుకు పంపిస్తాం.
- ల్యాండ్, లిక్కర్, పేపర్ లీక్ మాఫియాలను జైలుకు పంపిస్తాం.
- స్కామ్ చేసిన వారు ఎవరైనా వదిలిపెట్టం.
- బీఆర్ఎస్ చేసిన స్కాములు అన్నింటిపైనా దర్యాప్తు చేయిస్తాం.
- అణగారిన వర్గాలకు బీజేపీనే సంక్షేమం అందిస్తోంది.
- కొమురం భీమ్ మ్యూజియం రెడీ అవుతోంది.
హుజురాబాద్లో అమిత్ షా కామెంట్స్..
- హుజురాబాద్లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభకు అమిత్ షా హాజరు.
- బీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం ఆసన్నమైంది.
- బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారు.
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటు వేస్తే కుటుంబ పాలన వస్తుంది.
- బీజేపీకి ఓటు వేస్తే ప్రజా పాలన వస్తుంది.
- భారీ మెజార్టీలో ఈటల రాజేందర్ను గెలిపించండి.
- కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరింది.
- 2024లో కూడా మోదీనే ప్రధాని అవుతారు.
- కాంగ్రెస్కు ఓటు వేస్తే బీఆర్ఎస్కు ఓటు వేసినట్టే.
- బీఆర్ఎస్ వేస్తే కాంగ్రెస్కు వేసినట్టే.
- తెలంగాణకు కేంద్రం రూ.7లక్షల కోట్లను అందజేసింది.
- బీజేపీ అధికారంలోకి వచ్చాక మొదటి కేబినెట్ భేటీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం.
కేసీఆర్కు కిషన్రెడ్డి సవాల్
- సీఎం కేసీఆర్కు బీజేపీ చీఫ్ కిషన్రెడ్డి సవాల్ విసిరారు.
- మెడికల్ కాలేజీల కోసం కేసీఆర్ రాసిన 50 లేఖలు బయటపెడితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను.
- కేసీఆర్ మాటాల్లో వాడీవేడీ తగ్గింది.
బొగ్గుగనుల ప్రైవేటీకరణను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది: పొంగులేటి
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జగదాంబ సెంటర్ కార్నర్ మీటింగ్లో పాల్గొని ప్రసంగించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
- కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలి.
- బిఆర్ఎస్ పార్టీ దొంగల పార్టీ.
- అబద్దాలు చెప్పి రెండు పరియాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్.
- బీఆర్ఎస్ ద్రోహులను పారదోలి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి.
- ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలు ప్రజలు సుఖా సంతోషాలతో ఉంటారు.
- డిసెంబర్ 9వ తారీకు హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.
- 12 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వాల్సి ఉండగా నాలుగు లక్షల ఎకరాలకే పట్టాలిచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది.
- కేంద్రంలో,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు.
- కాంగ్రెస్ ప్రభుత్వంఅధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీ పథకాలు అమలు.
- ఇందిరమ్మ రాజ్యం వస్తే 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.
- రైతులకు రెండు లక్షల రుణమాఫీ.
- కాంగ్రెస్ వస్తే నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తాము.
- అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఫించన్ లు ఇస్తాం.
- నిరుపేదలకు ఇండ్ల స్థలం తో పాటు డబల్ బెడ్ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం.
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బొడు, కోమరారం మండలాలను ఏర్పాటు చేస్తాం.
- బీఆర్ఎస్ డబ్బులు ఇస్తే తీసుకోండి. ఓటు మాత్రం కాంగ్రెస్కు వేయండి.
హరీష్రావు వల్లే రైతు బంధు నిలిచిపోయింది.. డోర్నకల్ సభలో రేవంత్
- హరీష్ వ్యాఖ్యల వల్లే రైతు బంధు నిలిపేసినట్లు సీఈసీ తెలిపింది
- కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.4వేల పెన్షన్ ఇస్తాం
- పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు స్వస్తి పలకాలి
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: సచిన్ పైలట్
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సచిన్ పైలట్
- గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ..
- తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.
- ప్రజల్లో మంచి స్పందన ఉంది.
- రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంకా గాంధీల పర్యటనలకు మంచి స్పందన వస్తుంది.
- కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరలేదు.
- నిరుద్యోగం పెరిగి పోతున్నది.
- ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారు.
- భారత్ జోడోయాత్ర ద్వారా రాహుల్ గాంధీ 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.
- ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్తో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.
- నవంబర్ 30వ తేదీ జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేయాలి.
- కాంగ్రెస్కు అధికారం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారు.
- బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. వారికి క్రెడిబిలిటి లేదు.
- ఉద్యోగాలు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు.
- కర్ణాటక విజయం తరువాత జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితమే వస్తుంది.
- ఓట్ ఫర్ చేంజ్..
- మార్పు కోసమే ప్రజలు ఓటేయబోతున్నారు.
- రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బహుమతిగా ఇవ్వండి.
- రాజస్థాన్లో ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం ఉంది.
- సంప్రదాయాన్ని బ్రేక్ చేసి రాజస్థాన్లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది.
- కేంద్ర ప్రభుత్వం నుంచి రాజస్థాన్కు ఎలాంటి సహకారం ఇవ్వలేదు.
- ప్రజలు అర్ధం చేసుకున్నారు..
- ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారు.
- సీఎం అభ్యర్థి అనేది కాంగ్రెస్లో ఉండదు.
- అధిష్టానమే సీఎంని సెలెక్ట్ చేస్తుంది.
కాసేపట్లో వికాస్రాజ్తో కేశవరావు భేటీ..
- కాసేపట్లో సీఈఓ వికాస్ రాజ్తో భేటీ కానున్న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కేకే
- రైతు బంధుకు ఈసీ అనుమతి ఇచ్చి వెనక్కు తీసుకోవడంపై ఫిర్యాదు
- కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపైన ఈసీకి వివరించనున్న బీఆర్ఎస్ నేతలు
రైతుబంధు నిలిపివేతపై హరీశ్ కామెంట్స్..
- ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ రైతుబంధు నిలిపివేయడంపై మంత్రి హరీశ్ రావు స్పందన
- రైతుబంధు ఇవ్వవద్దని కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.
- రైతుబంధును ఎన్ని రోజులు ఆపుతారని ప్రశ్నించారు.
- వచ్చే నెల మూడో తేదీ తర్వాత మళ్లీ గెలిచేది మేమే.. అప్పుడ రైతుబంధు ఇస్తామన్నారు.
- తెలంగాణ రైతులతో కేసీఆర్ది పేగుబంధం మాది.
- కాంగ్రెస్ పార్టీ రైతుల నోటికాడ బుక్కను లాక్కుంది.
- నేను మీటింగ్లో న్యాయం గెలిచిందని.. రైతుబంధుకు ఈసీ క్లియరెన్స్ ఇచ్చిందని అన్నాను.
- రైతుబంధును ఆపిన కాంగ్రెస్కు ఓటుతోనే పోటు పొడవాలి.
- రైతుబంధు రావాలంటే కాంగ్రెస్ ఖతమ్ కావాలి.
- ఎకరాకు రైతుబంధు కాదు.. ఒక్కో రైతుకు 15వేలు ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది.
- మేము ఓట్ల కోసం రైతుబంధు తీసుకురాలేదు.
- కేసీఆర్ వస్తే పెన్షన్ రూ.5వేలు ఇస్తాం.
- సౌభాగ్యలక్ష్మి పేరుతో మహిళలకు నెలకు రూ.3వేలు ఇస్తాం.
- పేదలకు రూ.400లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం.
- రేషన్కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇస్తాం.
- బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఝురాసంఘంలో ఆరువేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తాం.
ప్రారంభమైన ఈసీఐ వీడియో కాన్ఫరెన్స్
- తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్న సీఈఓ వికాస్ రాజ్ అండ్ టీం
- హాజరైన డీఈవోలు, ఆర్వోలు, పోలీస్ అధికారులు
- ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీకి వివరించనున్న సీఈఓ వికాస్ రాజ్
- చివరి రెండు రోజుల పై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక దృష్టి
- డబ్బు, మద్యం కట్టడి పై చర్యలు తీసుకోవాలని సీఈసీ ఆదేశాలు
రోడ్ షోలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- సుల్తానాబాద్లో కేటీఆర్ రోడ్ షో
- బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం
- బీఆర్ఎస్ను గెలిపిస్తేనే సంక్షేమం, అభివృద్ధి అందుతాయి.
- 55 ఏళ్లలో ఏమీ చేయనివారు ఇప్పడు ఏం చేస్తారు.
- కాంగ్రెస్కు ఓటేస్తే అభివృద్ధి కుంటుపడుతుంది.
- కాంగ్రెస్కు అవకాశమిస్తే కరెంట్, రైతుబంధు ఆగిపోతాయి.
- కాంగ్రెస్ పార్టీ కొత్త కుట్రకు తెరలేపింది.
- రైతుబంధు వేయకుండా కాంగ్రెస్ అడ్డుకుంది.
- అధికారంలోకి రాకముందే రైతుబంధును అడ్డుకున్నారు.
కిషన్రెడ్డి కీలక వ్యాఖ్యలు..
- ఎన్నికల్లో ఓట్లు దండుకోవడమే కాంగ్రెస్, బీఆర్ఎస్ లక్ష్యం.
- కుటుంబ రాజకీయాలకు తెరదించాలంటే కేసీఆర్ను గద్దె దించాలి.
- గజ్వేల్, కామారెడ్డిలోనూ బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తారు.
- ప్రధాని నరేంద్ర మోదీ సభలకు జనం నీరాజనాలు పడుతున్నారు.
- యువత, మహిళలు, రైతులు బీఆర్ఎస్పై ఆగ్రహంతో ఉన్నారు.
రైతుబంధుపై రేవంత్ ఆసక్తికర కామెంట్స్
- బీఆర్ఎస్పై రేవంత్ ఫైర్
- ‘రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం
- నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా - అల్లుళ్లకు లేదు.
- హరీశ్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం.
- ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదు.
- రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దు.
- పది రోజుల్లో కాంగ్రెస్ రాగానే రూ.15 వేల రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తాం
రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా - అల్లుళ్లకు లేదు.
— Revanth Reddy (@revanth_anumula) November 27, 2023
హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం.
ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు… pic.twitter.com/H56vhAiNlk
కాంగ్రెస్ నేతలు వెంటపడి మరి రైతు బంధును ఆపించారు.. మీడియాతో ఎమ్మెల్సీ కవిత
- రాసిచ్చిన స్క్రిప్ట్ను ప్రియాంక చదువుతున్నారు
- బీజేపీ హయాంలో పెద్ద కంపెనీలే బాగుపడ్డాయి
- దండయాత్రకు వచ్చినట్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు
- సింగరేణిని ప్రైవేట్కు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ
- తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ నేతలంతా ఎక్కడ ఉన్నారు?
- రాహల్ గాంధీ జోడో యాత్రలో తెలంగాణ ప్రస్తావన లేదు
- కాంగ్రెస్ నాయకులు వెంటబడి రైతు బంధును ఆపించారు
- అభద్రతా భావంతోనే ఫిర్యాదు చేశారు
- కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీగా రుజువు చేసుకుంది
- నోటి కాడి బుక్కను లాక్కున్నారు కాబట్టి రైతులు ఆలోచించి ఓటు వేయాలి
- మంచోల్లు కావాలా ముంచే వాళ్లు కావాలా?
- 24 గంటల కరెంటు కావాలా, 3 గంటల కరెంట్ కావాలా?.
- కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాల్లో ఇంతవరకూ కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వలేదు.
- మతం పేరుతో మంట పెట్టాలని ఒక పార్టీ, కులం పేరుతో చిచ్చు పెట్టాలని మరో పార్టీ చూస్తుంది
బీఆర్ఎస్కు షాకిచ్చిన ఈసీ..
- రైతుబంధుకు బ్రేక్
- రైతుబంధు నిధులను నిలిపివేయాలని ఈసీ ఆదేశం
- గత వారం రైతుబంధుకు అనుమతించిన ఈసీ..
- రైతుబంధుపై ఫిర్యాదులు రావడంతో ఈసీ కీలక నిర్ణయం
భారీగా నగదు స్వాధీనం..
- ఖమ్మం, పెద్దపల్లిలో భారీ నమోదు స్వాధీనం
- ఖమ్మంలోని శ్రీరామ్నగర్లో ఓ ఇంట్లో సరైన పత్రాలు లేకుండా మూడు కోట్లు.
- నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు.
- అలాగే, పెద్దపల్లిలోని ఎన్టీపీసీలో కృష్ణనగర్లోని ఓ తాళం వేసిన ఇంట్లో భారీ నగదు గుర్తింపు, స్వాధీనం.
- ఓ జాతీయ పార్టీకి చెందిన కరపత్రాలతో పాటు రెండు కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఎఫ్ఎస్టీ టీమ్.
నేడు పెద్దపల్లిలో కేటీఆర్ ప్రచారం
- మంత్రి కేటీఆర్ నేడు పెద్దపల్లిలో పర్యటించనున్నారు.
- బీఆర్ఎస్ అభ్యర్ధి దాసరి మనోహర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం
- సుల్తానాబాద్లో రోడ్ షోలో పాల్గొననున్న కేటీఆర్
భారీ వర్షం.. ప్రచారంపై ఎఫెక్ట్
- ఆదిలాబాద్లో భారీ వర్షం కురుస్తోంది
- వర్షం ఎఫెక్ట్ ఎన్నికల ప్రచారంపై పడే అవకాశం ఉంది.
- నేడు ఛతీస్తగఢ్ సీఎం భూపేశ్ బఘేల్ ఎన్నికల ప్రచారం
- ఎన్నికల రోడ్ షోలో పాల్గొననున్న భూపేశ్ బఘేల్
- ఆయన రోడ్ షోపై వర్షం ఎఫెక్ట్
భువనగిరిలో ప్రియాంక ప్రచారం
- కాంగ్రెస్ ప్రియాంక గాంధీ నేడు భువనగిరిలో ప్రచారం
- ఉదయం 11:30 గంటలకు రోడ్ షోలో ప్రియాంక
- భువనగిరిలో భారీ ర్యాలీకి ప్లాన్ చేసిన కాంగ్రెస్
కరీంనగర్లో నేడు మోదీ పర్యటన
- ప్రధాని మోదీ నేడు కరీంనగర్లో ఎన్నికల ప్రచారం
- మధ్యాహ్నం ఒంటి గంటకు ఎస్ఎస్ఆర్ కాలేజీ గ్రౌండ్లో బీజేపీ సభ
- బీజేపీ సభలో పాల్గొననున్న ప్రధాని మోదీ
అమిత్ షా షెడ్యూల్ ఇలా..
- ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గంలో సకల జనుల విజయ సంకల్ప సభకు హాజరుకానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
- జమ్మికుంట డిగ్రీ కళాశాల మైదానంలో ఉదయం పది గంటలకు అభ్యర్థి ఈటల రాజేందర్కు మద్దతుగా ప్రచారం.
- మధ్యాహ్నం పెద్దపల్లిలో పర్యటించనున్న అమిత్ షా
- బీజేపీ అభ్యర్థి దుగ్యాల ప్రదీప్ రావుతో కలిసి రోడ్డు షోలో ప్రచారం చేయనున్న అమిత్ షా.
- జగిత్యాలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రోడ్ షో..
- జగిత్యాల బీజేపీ అభ్యర్థి బోగ శ్రావణికి మద్దతుగా ప్రచారం.
30న తెలంగాణ భవిష్యత్తు తేలిపోతుంది.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
- మా రాష్ట్రం వస్తే గ్యారంటీల అమలు చూపిస్తాం
- ముషీరాబాద్, మక్తల్ కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం
ఈ రెండు రోజులూ కీలకం
- బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమీక్ష
- ప్రచారం ఉధృతం చేయండి
- పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టండి
- గట్టి పోటీ ఇస్తున్న 45–50 సీట్లలో ఎక్కువ గెలవాలి
నేడు మోదీ, అమిత్షా సహా ముఖ్యనేతల ప్రచారం
- మహబూబాబాద్, కరీంనగర్లలో మోదీ బహిరంగసభ
- జేపీ నడ్డాతో సహా కొందరు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత సీఎంలు సోమవారం విస్తృత ప్రచారం
- మహబూబాబాద్, కరీంనగర్లలో బహిరంగసభలతో పాటు హైదరాబాద్లో మోదీ రోడ్షో
- అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవంలో పాల్గొననున్న మోదీ
- గురుద్వారాను సందర్శించిన అనంతరం ఢిల్లీకి తిరుగు పయనం
- హుజూరాబాద్లో బహిరంగసభ, పెద్దపల్లి, మంచిర్యాలలో అమిత్షా రోడ్షో
- అనంతరం బేగంపేట నుంచి ఢిల్లీకి..
- సోమవారం ఉదయం జగిత్యాలలో రోడ్షో అనంతరం బోధన్, బాన్సువాడ, జుక్కల్ బహిరంగసభల్లో పాల్గొననన్ను జేపీ నడ్డా
- దేవరకద్ర, మంథని సభల్లో, పరకాలలో రోడ్షో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ
- హనుమకొండలోని విష్ణుపురి గార్డెన్స్లో ఐటీ ఇంటలెక్చువల్ మీట్లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖమంత్రి పీయూష్ గోయల్
- సిద్దిపేటలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో కేంద్ర సమాచార, క్రీడాశాఖ మంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్
- అలంపూర్లో పార్టీ నాయకు లు, కార్యకర్తల సమావేశానికి హాజరుకానున్న కేంద్ర సహాయ మంత్రి వి.మురళీధరన్
మంచినీరు, కరెంటు వస్తేనే కారుకు ఓటేయండి.. సాక్షిటీవీ లైవ్షోలో మంత్రి హరీశ్రావు
- ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని వాటిని కూడా నెరవేర్చాం
- కర్ణాటకలో కాంగ్రెస్ జనాన్ని మోసం చేసింది
- కేసీఆర్ ఫామ్హౌస్ సీఎం కాదు...ఫామింగ్ సీఎం
- మేం 12 సార్లు రైతుబంధు ఇచ్చాం. కాంగ్రెస్ వస్తే 12 మంది ముఖ్యమంత్రులు
- ప్రభుత్వ పథకాలపై కాంగ్రెస్ దుష్ప్రచారం తిప్పికొడుతున్నాం
- కాళేశ్వరంతో రాష్ట్రం సస్యశ్యామలం
అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో ఐటీ సోదాలు