
సాక్షి, అనంతపురం: గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నేతలు నామినేషన్లు వేయకుండా అడ్డుకుందాం. వైఎస్సార్ సీపీ నేతలు టీడీపీలో చేరితే సరి లేదంటే కక్ష సాధింపు చర్యలు తప్పవు. నారా లోకేష్ రెడ్ బుక్ క్లోజ్ చేసినా నేను మాత్రం ఊరుకోను.. అందరి సంగతి తేలుస్తా. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నేను రెడ్ బుక్ ఓపెన్ చేస్తా... ప్రతిపక్ష పార్టీ నేతల తోకలు కత్తిరిస్తా’అని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
