‘ఏబీఎన్‌ రాధాకృష్ణ శ్రమ వ్యర్థమే’ | Tadikonda MLA Undavalli Sridevi Fires On Yellow Media | Sakshi
Sakshi News home page

ఎల్లో మీడియాకు భయపడం : ఎమ్మెల్యే శ్రీదేవి

Nov 12 2020 6:29 PM | Updated on Nov 12 2020 7:13 PM

Tadikonda MLA Undavalli Sridevi Fires On Yellow Media - Sakshi

ఏబీఎస్‌ రాధాకృష్ణ దళితులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు

సాక్షి, అమరావతి : ఎల్లో మీడియా తనపై అసత్య ప్రచారం చేస్తుందని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలపై నిజ నిజాలను తెలుసుకోకుండా ఎల్లో మీడియా ప్రసారం చేస్తుందని మండిపడ్డారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దళిత డాక్టర్ని అయిన తాను,  ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఎవరో అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ట్యాప్‌ను డైలీ సీరియల్‌లా ఎల్లో మీడియా ఎలా ప్రసారం చేశారని ప్రశ్నించారు.
(చదవండి : మీ నీచ రాజకీయాలు రాష్ట్రం మొత్తం తెలుసు బాబూ)

చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో పట్టుబడినప్పుడు ఎల్లో మీడియా ఎందుకు ప్రసారం చేయలేదని నిలదీశారు. ఏబీఎస్‌ రాధాకృష్ణ దళితులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్పీ రేటింగ్‌ కోసం ఎల్లో మీడియా ఇంత దిగజారుతుందా అని అసహనం వ్యక్తం చేశారు. మునిగిపోతున్న టీడీపీ పార్టీని రాధాకృష్ణ బతికించాలని చూస్తున్నారని, కానీ అతని శ్రమ వ్యర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. ఎల్లో మీడియాకు భయపడే రోజులు పోయాయని, ఇకనైనా అసత్య ప్రచారాలను నిలివిపేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement