breaking news
thadikonda
-
తాడికొండ టీడీపీలో ఫ్లెక్సీల వివాదం
-
‘ఏబీఎన్ రాధాకృష్ణ శ్రమ వ్యర్థమే’
సాక్షి, అమరావతి : ఎల్లో మీడియా తనపై అసత్య ప్రచారం చేస్తుందని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలపై నిజ నిజాలను తెలుసుకోకుండా ఎల్లో మీడియా ప్రసారం చేస్తుందని మండిపడ్డారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దళిత డాక్టర్ని అయిన తాను, ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఎవరో అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ట్యాప్ను డైలీ సీరియల్లా ఎల్లో మీడియా ఎలా ప్రసారం చేశారని ప్రశ్నించారు. (చదవండి : మీ నీచ రాజకీయాలు రాష్ట్రం మొత్తం తెలుసు బాబూ) చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో పట్టుబడినప్పుడు ఎల్లో మీడియా ఎందుకు ప్రసారం చేయలేదని నిలదీశారు. ఏబీఎస్ రాధాకృష్ణ దళితులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్పీ రేటింగ్ కోసం ఎల్లో మీడియా ఇంత దిగజారుతుందా అని అసహనం వ్యక్తం చేశారు. మునిగిపోతున్న టీడీపీ పార్టీని రాధాకృష్ణ బతికించాలని చూస్తున్నారని, కానీ అతని శ్రమ వ్యర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. ఎల్లో మీడియాకు భయపడే రోజులు పోయాయని, ఇకనైనా అసత్య ప్రచారాలను నిలివిపేయాలని సూచించారు. -
ఏమిటీ దుర్భరస్థితి ?
సాక్షి, తాడికొండ(గుంటూరు) : స్థానిక బీసీ బాలికల వసతి గృహాన్ని బుధవారం రాత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖామంత్రి శంకర నారాయణ.. స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితో కలిసి పరిశీలించారు. 105 మంది విద్యార్థులకుగాను 20 మరుగుదొడ్లు ఉన్నాయి. వీటిలో 10 మరుగుదొడ్లకు తలుపులు ఊడిపోయి ఉండటాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికలు ఉండే వసతి గృహంలో ఇలాంటి దుర్భర పరిస్థితి ఏంటని వార్డెన్ను ప్రశ్నించారు. ‘కనీస మరమ్మతులు చేయించాల్సిన బాధ్యత లేదా.. విద్యార్థినులు ఇలాంటి వాటిలో ఎలా కాలకృత్యాలు తీర్చుకుంటార’ని ప్రశ్నించారు. మరమ్మతుల కోసం ఇటీవల అంచనాలు రూపొందించామని బీసీ సంక్షేమ శాఖ డీడీ చినబాబు తెలిపారు. అనంతరం విద్యార్థినులను పిలిచి మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా ? లేదా ? పాలు, గుడ్లు ఎన్నిసార్లు ఇస్తున్నారు. చికెన్ వారంలో ఎన్ని సార్లు అందుతుంది. నాణ్యత ఉంటుందా ? లేదా ? అని ప్రశ్నించారు. అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించిన అనంతరం విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. కష్టపడి చదవండి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ తానూ హాస్టల్లో చదివానని, కష్టపడి చదవాలని సూచించారు. అక్కడ నుంచి స్టోర్ రూమ్లో సరుకులను మంత్రి పరిశీలించారు. అనంతరం వండిన అన్నం, కూరలను రుచి చూశారు. బెడ్లు ఒక దానిపై ఒకటి రెండు స్టేర్లుగా ఉండటంతో పైన పడుకున్న వారికి ఫ్యాన్లు తగులుతున్నాయని విద్యార్థులు చెప్పగా.. సమస్య పరిష్కారం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. తిరిగి వారం రోజుల్లో ఇదే రోజు వసతి గృహాన్ని తనిఖీ చేస్తానని, ఏమైనా సమస్యలు ఉంటే ఒప్పుకోనని హెచ్చరించారు. అనంతరం మంత్రి శంకరనారాయణ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వసతి గృహాల ఉన్న స్థితిని గుర్తించి ఉన్నత స్థితికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ అమ్మ ఒడి పథకంతో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగిందని తెలిపారు. బీసీలంటే బ్యాక్ బోన్ కులాలు అనే విషయాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి రుజువు చేస్తున్నారని చెప్పారు. వారి వెంట తాడికొండ, తుళ్లూరు, మేడికొండూరు మండల పార్టీ అధ్యక్షులు తియ్యగూర బ్రహ్మారెడ్డి, బత్లు కిషోర్, కందుల సిద్ధయ్య, మాజీ ఎంపీపీలు బండ్ల పున్నారావు, కొమ్మినేని రామచంద్రరావు, జిల్లా కార్యదర్శి మల్లంపాటి రా«ఘవరెడ్డి, ఇతర నాయకులు ఉన్నారు. -
ఏం అర్హత ఉందని లోకేష్కు మూడు శాఖలు?
-
ఈ సారి పప్పు ఇంటికి పోతాడు : వైఎస్ షర్మిల
సాక్షి, గుంటూరు : ‘ బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? కేవలం చంద్రబాబు గారి కొడుకు లోకేష్కు వచ్చింది. ఈ పప్పు గారికి కనీసం జయంతికి, వర్ధంతికి తేడా కూడా తెలియదు. అటువంటి వ్యక్తి ఒకటి కాదు రెండు ఏకంగా మూడు శాఖలకు మంత్రి అయి కూర్చున్నారు. అఆలు రావు గానీ అగ్ర తాంబూలం నాకే కావాలన్నాడట ఎవరో. పప్పు తీరు కూడా అలాగే ఉంది. ఒక్క ఎన్నికలో కూడా గెలవని పప్పుకు ఏ అర్హత ఉందని చంద్రాబాబు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఇది పుత్ర వాత్సల్యం కాదా. ఈసారి పప్పు కచ్చితంగా ఇంటికి పోతారు. ఏమి అర్హత ఉందని లోకేష్కు మూడు శాఖలు ఇచ్చారు?’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సోదరి షర్మిల చంద్రబాబును ప్రశ్నించారు. శుక్రవారం నుంచి బస్సు యాత్ర ప్రారంభించిన షర్మిల గుంటూరు జిల్లా తాడికొండలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే.... రాజన్న రాజ్యం ఎలా ఉండేది తాడికొండ ప్రజలకు, ఇక్కడు చేరివచ్చిన ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి చెల్లికి , ప్రతి అన్నకు మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. రాజన్న రాజ్యం ఎలా ఉండేది? ప్రతి పేదవాడి అండగా, ప్రతి రైతుకు ధైర్యంగా కలిగించేలా, ప్రతి మహిళకు భరోసా కలిగించే ఉండేది. ప్రతి విద్యార్థికి అండగా ఉంటూ డాక్టర్ అవుతారా.. ఇంజనీరు అవుతారా.. ఏది కావాలంటే అది చదివిస్తా అంటూ భరోసా ఇచ్చేవాడు. ఆరోగ్యశ్రీతో లక్షల మందికి ప్రాణం పోశారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని శ్రమించారు. ఐదేళ్లలో ఒక్క రూపాయి పన్ను పెంచకుండానే అభివృద్ది చేసి చూపించారు. కుల, మత, మన, తన తేడా లేకుండా ప్రతి ఒక్కరికి మేలు చేశాడు. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ఎలా ఉంది. రైతు రుణమాఫీ అంటూ చేసిన మొదటి సంతకానికే దిక్కులేదు. డ్వాక్రామహిళలకు రుణమాఫీ చేస్తానన్నారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఐదేళ్లు ఏమి చేయకుండా పసుపు కుంకుమ అంటూ మోసం చేయడానికి వస్తున్నాడు. అక్కా చెల్లెళ్లు మోస పోతారా? ఈ సారి చంద్రబాబు చేతుల్లో మోసపోకండి. చంద్రబాబును ఇవి అడగండి గతఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారు. దాంట్లో ఒక్క వాగ్ధానం నిలబెట్టుకోలేదు. ఇప్పుడు చేపలకు ఎరవేసి నట్లు కొత్త పథకాలతో వస్తున్నారు. ఎరవేస్తే ప్రజలు నమ్ముతారా? చిన్న పిల్లలకు చాక్లెట్లు ఇచ్చినట్లుకాదు. ప్రతి ఒక్కరూ చంద్రబాబును నిలదీయండి. అది మీ హక్కు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేస్తామని చెప్పి ఈ ఐదేళ్లలో ఒక్కరికైనా ఇచ్చారా? ఫీజు రీయింబర్స్మెంట్ చేశారా. మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చారా. విద్యార్థులకు ఐపాడ్లు ఇచ్చారా? లేదు. ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అని చెప్పి వంచించారు. ఐదేళ్లలో నెలకు రూ.2 వేల ప్రకారం రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ దాదాపు రూ.1.25 లక్షలు చొప్పున చంద్రబాబు బాకీ పడ్డారు. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల భూమి, పక్కా ఇళ్లు అన్నారు. ఎక్కడైనా కట్టించారా? చేనేతల మరమగ్గాలకు పూర్తి రుణమాఫీ అన్నారు. ఎన్నికలు పూర్తయ్యేలోపు బాకీ పడ్డ ఇవన్నీ మాకు ఇవ్వండి అని బాబును నిలదీయండి. జగనన్న లేకుంటే చంద్రబాబు హోదా అనేవాడా? ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జగనన్న ఢిల్లీలో ధర్నాలు చేశారు. రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశారు. బంద్లు, రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు, కొవ్వొత్తుల ర్యాలీలు.. ఇలా ఈ ఐదేళ్లలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం కూడా పెట్టారు. రాజీనామాలూ చేశారు. జగనన్న యువభేరి పేరిట యువతను జాగృతం చేశారు. ఆయనే గనుక ఊరురా తిరిగి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయకపోతే చంద్రబాబు నోటి నుంచి ప్రత్యేక హోదా అనే మాట వచ్చి ఉండేదా? హోదా వద్దు.. ప్యాకేజీ కావాలన్న చంద్రబాబును యూటర్న్ తీసుకునేలా చేసింది జగనన్న కాదా? ఈ విషయాల గురించి చంద్రబాబు నిజం చెప్పాలి. కానీ ఆయన చెప్పరు. చంద్రబాబు నైజం గురించి నాన్న గారు ఒకమాట చెప్పేవారు.. ఎప్పుడైతే చంద్రబాబు నిజం చెబుతారో అప్పుడు ఆయన తల వేయి ముక్కలవుతుందట. పాపం అందుకే ఆయన ఎప్పుడూ అబద్ధాలే చెబుతుంటారు. ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు.. ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తు.. రోజుకో మాట పూటకో వేషం వేస్తున్న బాబును చూసి ఊసరవెల్లి కూడా పారిపోతుంది. కేసు నుంచి తప్పించుకోవడానికి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు. ఆ రోజు నుంచి గత ఏడు నెలల వరకు కేసీఆర్తో పొత్తు పెట్టుకోవాలని చూశారు. పొత్తు పెట్టుకోవాలని చూసింది చంద్రబాబు అయితే ఇప్పుడు మాతో పొత్తు అంటున్నాడు. మాకు కేసీఆర్తో పొత్తు లేదు. సింహం సింగిల్గానే వస్తుంది. వైఎస్సార్సీపీ సింగిల్గానే గెలుస్తుందని ప్రతి సర్వే చెబుతుంది. పదవులు లేకున్నా జగన్ మోహన్ రెడ్డి తొమ్మిదేళ్ల పాటు విలువలతో కూడిన రాజకీయం చేశాడని కొనియాడారు. జగన్ లాంటి మంచి మనిషికి ఒక అవకాశం ఇస్తే వైఎస్సార్ లాగానే ఆయన కూడా ప్రతి వర్గానికి మేలు చేస్తారని అన్నారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వేణుగోపాల్రెడ్డి అన్నను, ఎమ్మెల్యే అభ్యర్థి ఉండవల్లి శ్రీదేవిను జగనన్న నిలబెట్టారు. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. -
తాడికొండలో.. అనకొండలు..
సాక్షి, గుంటూరు: తాడికొండ నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన అవినీతి అనకొండలు పడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ సారథ్యంలో ప్రజా ధనాన్ని నిలువునా దోచుకున్నాయి. రాజధాని ప్రాంతం కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా భూములను కబ్జా చేశాయి. రైతుల పొలాల్లో సెంట్ల చొప్పున భూమి కాజేసి కోట్ల రూపాయలు దండుకున్నాయి. నీరు– చెట్టు పథకం పేరిట అడ్డగోలుగా చెరువులు, పంట పొలాలను తవ్వేసి మట్టిని అమ్మేసుకున్నాయి. గ్రావెల్ను సైతం కొల్లగొట్టి కోట్ల రూపాయలు గడించాయి. కమీషన్లకు కక్కుర్తి పడి అభివృద్ధి పనుల్లో నాణ్యతకు పాతర వేశాయి. ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ అండదండలతో నియోజకవర్గాన్ని అక్రమాలు, అవినీతి, అరాచకాలకు కేంద్ర బిందువుగా మార్చాయి. అక్రమంగా కాజేసిన సొమ్ము పంపకాల్లో తేడాలొచ్చి.. మింగిన ప్రజాధనం వివరాలన్నీ రోడ్డెక్కి మరీ కక్కేశాయి. మొత్తంగా నియోజకవర్గంలో సుమారు రూ.400 కోట్ల వరకు సహజ వనరులను లూటీ చేశాయి. ఇవన్నీ తెలిసినా ముడుపులు తీసుకున్న అధికారుల చేతులు నిబంధనలన్నింటినీ తమ గుప్పెట్లో పెట్టుకుని ముడుచుకుపోయాయి. రూ.200 కోట్లపైనే.. టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ అండదండలతో రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలంలో అధికార పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు. నేటి వరకూ తుళ్లూరు మండలంలోని వివిధ గ్రామాల్లో భూకబ్జాలు, అక్రమ వసూళ్లు, మట్టి తవ్వకాల్లో రూ.200 కోట్లకుపైగా దిగమింగారు. వడ్డమాను గ్రామం ఎంపీటీసీ పిన్నక సాంబశివరావు 74/ఏ, 74/బీ అనే సర్వే నంబర్లలో సుమారు 33.7 ఎకరాల కొండ పోరంబోకు భూమిని కబ్జా చేశాడు. దీని విలువ సుమారు రూ. 20 కోట్లపైనే ఉంటుంది. పేదలకు చెందాల్సిన భూమిలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని గృహాలు నిర్మించుకున్నారు. యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు.. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎమ్మెల్యే శ్రావణ్, ఆయన అనుచరులు నియోజవకర్గంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు అక్కడ రాబందుల్లా వాలిపోయి భూమిని వశపరుచుకొని అక్రమంగా మట్టి, గ్రావెల్ తవ్వకాలను సాగిస్తున్నారు. కైలాసగిరి కొండ ప్రాంతంలో ఎమ్మెల్యే శ్రావణ్ అనుచరులు గ్రావెల్ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. సర్వే నంబర్ 573లో 7 ఎకరాల 28 సెంట్ల కుంట పోరంబోకు స్థలంలో గతంలో మాజీ సైనికులు, నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్లు, పంటలు వేసుకోవటానికి భూమి ఇచ్చింది. ఈ భూములపై కన్నేసిన ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ పీఏ బత్తుల సురేశ్బాబు, విశదల గ్రామానికి చెందిన ఎమ్మెల్యే సన్నిహితుడు నరేంద్ర 2018 ఫిబ్రవరి నుంచి ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుపుతున్నారు. టిప్పర్కు రూ.1500 చొప్పున గ్రావెల్ను అమ్ముకుంటున్నారు. ఇలా రోజుకు వందల సంఖ్యలో టిప్పర్లను తిప్పుతున్నారు. ఇలా ఎమ్మెల్యే శ్రావణ్, ఆయన పీఏ, సన్నిహితుడు గ్రావెల్ అక్రమ రవాణా ద్వారా రూ.2 కోట్లకుపైగా గడించారు. లాంలో అక్రమంగా లోడింగ్ చేస్తున్న గ్రావెల్ (ఫైల్) సొసైటీ లీజులు అతిక్రమించి.. లాంలో ది లాం లేబర్ కాంట్రాక్ట్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరిట 60 సంవత్సరాలుగా లీజు పాలసీ నడుస్తోంది. దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకుని సర్వే నెం. 199ఏలో 1.5 హెక్టార్ల కొండను మైనింగ్ చేసుకుంటున్నారు. సొసైటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి పరాజయం పాలవడంతో ఎలాగైనా క్వారీని సొంతం చేసుకోవాలనుకున్న నాయకులు కుటిల పన్నాగం పన్నారు. అధికారులను, అధికారాన్ని అడ్డుగా పెట్టి క్వారీని నిలిపేయించడంతోపాటు పలుమార్లు కోర్టుల్లో కేసులు వేశారు. దీంతో మూడున్నర సంవత్సరాలుగా క్వారీ మూతపడి కార్మికులు రోడ్డున పడ్డారు. అధికార పార్టీకి చెందిన నాయకులు మాత్రం యథేచ్ఛగా గ్రావెల్ను తవ్వి అమ్మకాలు జరుపుకుంటూ కాసులు వెనకేసుకున్నారు. గతంలో గ్రామానికి చెందిన ఓ మైనార్టీ నాయకుడు ఈ తంతుకు తెరలేపడంతో అధికారులు కిమ్మనకుండా కూర్చున్నారు. రాత్రివేళ యంత్రాలతో మట్టిని తవ్వి పోగుచేయడంతోపాటు లోడింగ్ చేసి గుంటూరు, లాం పరిసర ప్రాంతాలలోని వెంచర్లకు, బహిరంగ మార్కెట్లో అమ్మకాలు చేశారు. దీనిపై సొంత పార్టీ నాయకులే బహిరంగ ఆరోపణలు చేయడం, లీజుదారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో తవ్వకాలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే అండదండలతో నెక్కల్లు గ్రామంలో ఆయన అనుచరుల అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. నెక్కల్లు గ్రామానికి ప్రధాన రహదారి వెంబడి ఉన్న సర్వే నెంబర్ 87/ఏలో తుళ్లూరు చేనేత పరపతి విక్రయ సంఘం భూమిని ఎమ్మెల్యే అనుచరుడు మేకల రవికుమార్ తన భార్య పేరు మీద నకిలీ దస్తావేజులు సృష్టించి భవనం నిర్మించుకున్నాడు. 25 సెంట్ల విస్తీర్ణం గల ఈ భూమి రూ. 3 కోట్ల విలువ ఉంది. గ్రామంలో 24 ఎకరాల్లో ఉన్న ఊర చెరువు భూమిలో ఎమ్మెల్యే అనుచరులు దాదాపు 5 ఎకరాలు ఇప్పటికే ఆక్రమించుకుని పశువుల పాకలను నిర్మించారు. ప్రస్తుతం మరో మూడు ఎకరాలకు మట్టిని తోలి లెవల్ చేస్తున్నారు. టీడీపీ నాయకులు ఆక్రమించిన ఈ 8 ఎకరాలు రూ. 80 కోట్లపైనే విలువ చేస్తుంది. సైనికుడి భూమిని చెరబట్టారు... ఆర్మీలో పనిచేసిన కొడుకుతో తల్లి షబీరున్నీసాబీ మేడికొండూరుకు చెందిన షేక్ ఆదాం సైన్యంలో పని చేశారు. భారత్–చైనా యుద్ధంలో పాల్గొన్నారు. ఆదాంను భారత ప్రభుత్వం మెడల్స్తో సత్కరించింది. రెండు దశాబ్దాలకుపైగా భారత సైన్యంలో సేవలందించినందుకుగాను అతనికి మేడికొండూరు పోలీస్స్టేషన్ సమీపంలో సర్వే నంబర్ 347లో 2 ఎకరాల 59 సెంట్ల భూమిని 1964లో రాసిచ్చింది. ఈయనకు ఇద్దరు పిల్లలు. వీరిలో ఒకరు ఆర్మీలో పని చేశారు. మాజీ సైనికుడికి ఇచ్చిన భూమిపై ఎమ్మెల్యే శ్రావణ్ అనుచరుల కన్ను పడింది. పచ్చగా సాగవుతున్న భూమిని టీడీపీ కబ్జాకోరులు 4 సంవత్సరాల క్రితం నీరు– చెట్టు పేరుతో తవ్వేసి చెరువులో కలిపేశారు. భర్త మరణానంతరం షబీరున్నీసాబీ ప్రభుత్వమిచ్చిన భూమిని సాగు చేసుకుంటూ పొట్ట పోసుకొంటోంది. అధికార పార్టీ నేతలు భూమిని అన్యాక్రాంతం చేయడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు, ప్రస్తుత ఫిరంగిపురం మార్కెట్ యార్డు చైర్మన్ నార్నె శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన భూకబ్జాపర్వంపై ఎదురు తిరిగినందుకు ఆదాం రెండో కుమారునిపై ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించి జైలుకు పంపారు. దేశం కోసం పోరాడిన సైనికుని కుటుంబానికి ఇంతటి కష్టమొస్తే కనీసం ఆదుకోవాల్సిన రెవెన్యూ అధికారులు సైతం పచ్చపార్టీ నేతల అడుగులకు మడుగులొత్తారు. సెంట్లు చొప్పున భూమిని కాజేశారు అనంతవరం లో ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు ఒక్కో రైతు నుంచి వారి రికార్డుల ఆధారంగా చేసుకుని సెంట్లు భూమిని కాజేశారు. 30 ఎకరాలలో ఈ విధంగా చిన్న సన్నకారు దళిత రైతుల వద్ద నుంచి ఆక్రమించుకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేశారు. కోర్టులను ఆశ్రయించడంతో కేవలం నోటీసులు మాత్రమే జారీ చేసి రెవెన్యూ, సీఆర్డీఏ అధికారులు చేతులను దులుపుకున్నారు. టీడీపీ నేతలు కబ్జా చేసిన భూమి విలువ సుమారుగా రూ.50 కోట్ల వరకు ఉంటుంది. మట్టిని మింగేశారు రావెల–పొన్నెకల్లు గ్రామాల మధ్య చెరువులో మట్టిని మండల పార్టీ ఉపాధ్యక్షుడు దగ్గుమల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలువురు టీడీపీ నాయకులు జన్మభూమి కమిటీ పేరిట ప్రైవేటు వెంచర్లు, ఇతర గ్రామాలకు మళ్లించి రూ. 4 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ అదే పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ కొమ్మినేని రామచంద్రరావు ఆరోపించడంతో భారీ అవినీతి తంతు బయటపడింది. 4 సంవత్సరాలలో అక్రమంగా క్వారీయింగ్ నిర్వహించి పరిమితికి మించి మట్టిని తవ్వారని, రూ.4 కోట్ల మేర మట్టిని నీరు చెట్టు పథకం పేరిట స్వాహా చేశారని పంచాయతీ వార్డు మెంబర్లే స్వయంగా ఏడుగురి సంతకాలతో కలెక్టర్కు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు దాడులు నిర్వహించి వాహనాలను సీజ్ చేశారు. పొన్నెకల్లులో నీరు– చెట్టు కింద పూడికతీత తీసిన మట్టి విక్రయాలకు సంబంధించి లెక్కల విషయంలో మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు గుర్రం ఆదినారాయణ, ప్రస్తుత మార్కెట్ యార్డు ఛైర్మన్ గుంటుపల్లి మధుసూదనరావు వర్గీయుల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తి ఎమ్మెల్యే ఎదుటే వాదోపవాదాలకు దిగారు. రూ. కోట్లు గడించారు తాడికొండ మండల కేంద్రలో నీరు–చెట్టు కార్యక్రమం పేరుతో టీడీపీ నాయకులు భారీగా మట్టిని తరలించి రూ. కోట్లు గడించారు. మట్టిని అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం వివరాలు ఇంత వరకు బయటకు పొక్కనీయకపోవడం గమనార్హం. గ్రామ పంచాయతీలో తీర్మానం, టెక్నికల్ ఎస్టిమేట్లు లేకుండా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి విరాళాల పేరిట రూ.6 లక్షలు అధికార పార్టీ నాయకులు వసూలు చేశారు. ఎలాంటి వేలం నిర్వహించకుండా విరాళాలు సేకరించిన వారికే దుకాణాలు కేటాయిస్తామంటూ హామీ కూడా ఇచ్చి హడావుడిగా ప్రారంభోత్సవం చేశారు. విషయం పత్రికలకు ఎక్కడంతో దాదాపు ఏడాదిన్నరగా షాపింగ్ కాంప్లెక్స్ మూతబడింది. విరాళాలను పంచాయతీ ఖాతాలో జమ చేయకుండా సొంతానికి వాడుకున్న టీడీపీ నాయకులు.. ఆ కాంప్లెక్స్కు తిరిగి ప్రభుత్వ నిధులు బిల్లులు చేయాలంటూ అధికారులను ఒత్తిడికి గురి చేస్తున్నారు. టీడీపీకి చెందిన వార్డు మెంబర్ ఇళ్ల స్థలాలను ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. అతనికి పంచాయతీకి చెందిన స్థలాలను లీజు పేరిట కట్టబెట్టారు. కంతేరులో భారీ దోపిడీ కంతేరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు సర్పంచ్ను సైతం పక్కన పెట్టి పారదర్శకత అంటూ ప్రచారం చేస్తూ సొంత వ్యక్తులను నియమించుకొని భారీగా మట్టి దోపిడీకి పాల్పడ్డాడు. ఈ నిధులకు ఆడిటింగ్ చేయించిన అనంతరం గ్రామంలో పంచాయతీ భవనం నిర్మాణం చేయిస్తానంటూ నిధులు జేబులోకి మళ్లించాక చేతులెత్తేశాడు. మట్టి వ్యవహారంపై అçప్పట్లో సర్పంచ్ భర్తకు ఓ ప్రజాప్రతినిధికి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో విషయం బయటకు పొక్కింది. రావెలలో.. తెలుగు తమ్ముళ్లు నీరు– చెట్టు పేరిట సహజ సంపదను దోచుకొని జేబులు నింపుకున్నారు. తాడికొండ మండలం రావెల గ్రామంలో అధికార పార్టీకి చెందిన మండల పరిషత్ ఉపాధ్యక్షుడు దగ్గుమల్లి శ్రీనివాసరావు నీరు– చెట్టు పథకం కింద మట్టిని అమ్ముకొని రూ. కోట్లు కొల్లగొట్టారంటూ అదే పార్టీకి చెందిన కొమ్మినేని రామచంద్రరావు మీడియా సాక్షిగా ధ్వజమెత్తారు. లాంలో మట్టి దందా నడుపుతూ ఎమ్మెల్యే శ్రవణ్ పేరు చెప్పి బెదిరింపులకు దిగుతున్నారంటూ గతంలో టీడీపీకి చెందిన ఓ వర్గం ఆందోళనకు దిగింది. పొన్నెకల్లులో మరో అడుగు ముందుకేసిన నాయకులు నీరు–చెట్టు పథకం కింద గ్రామ అవసరాలకు దానంగా ఇచ్చిన ఊర చెరువును పూడ్చి కల్యాణ మండపం నిర్మిస్తామంటూ విమర్శించారు. ఎమ్మెల్యే అండదండలతో నెక్కల్లు గ్రామంలో ఆయన అనుచరుల అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. నెక్కల్లు గ్రామానికి ప్రధాన రహదారి వెంబడి ఉన్న సర్వే నెంబర్ 87/ఏలో తుళ్లూరు చేనేత పరపతి విక్రయ సంఘం భూమిని ఎమ్మెల్యే అనుచరుడు మేకల రవికుమార్ తన భార్య పేరు మీద నకిలీ దస్తావేజులు సృష్టించి భవనం నిర్మించుకున్నాడు. 25 సెంట్ల విస్తీర్ణం గల ఈ భూమి రూ. 3 కోట్ల విలువ ఉంది. గ్రామంలో 24 ఎకరాల్లో ఉన్న ఊర చెరువు భూమిలో ఎమ్మెల్యే అనుచరులు దాదాపు 5 ఎకరాలు ఇప్పటికే ఆక్రమించుకు ని పశువుల పాకలను నిర్మించారు. ప్రస్తుతం మరో మూడు ఎకరాలకు మట్టిని తోలి లెవల్ చేస్తున్నారు. టీడీపీ నాయకులు ఆక్రమించిన ఈ 8 ఎకరాలు రూ. 80 కోట్లపైనే విలువ చేస్తుంది. కమీషన్ల దందా పెదపరిమి గ్రామంలో ఎమ్మెల్యే పేరు చెప్పుకుని టీడీపీ సీనియర్ నాయకుడు, రైతు విభాగం నేత నూతలపాటి రామారావు చేస్తున్న అవినీతి పరాకాష్టకు చేరింది. గ్రామంలో ఏ అభివృద్ధి పని చేపట్టినా ఈయన కమిషన్లు వసూలు చేస్తున్నారు. నీరు చెట్టు పథకాన్ని అడ్డుపెట్టుకుని భారీగా మట్టి అమ్ముకున్నారు. సిలార్ఖాన్ అనే కౌలు రైతు 2015 సెప్టెంబరు 21 తేదీన అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి మరణించాడు. కౌలు రైతు కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయంలో వాటా ఇవ్వటానికి సిలార్ కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో ఎమ్మెల్యే ద్వారా ఆ పరిహారాన్ని నిలిపి వేయించాడు. తుళ్లూరుకు చెందిన సీనియర్ నాయకుడు ఒకరు సీఆర్డీఏ అధికారులను తన చెప్పుచేతల్లో పెట్టుకుని ఉద్యోగ విరమణ చేసిన అధికారులను కొనసాగిస్తూ గ్రామ కంఠాల పరిహారాలను ఒకటికి రెండింతలు పొందుతున్నారు. నీరు–చెట్టు పథకంలో దోపిడీ రూ.100 కోట్లు భూకబ్జాలతో దండుకున్న మొత్తం రూ.200 కోట్లు గ్రావెల్ అమ్ముకున్న సొమ్ము రూ.50 కోట్లు రైతుల పొలాల్లో సెంట్ల రూపంలో కాజేసిన భూమి రూ.50 కోట్లు కైలాసగిరి కొండ ప్రాంతంలో మట్టి తరలిస్తున్న లారీలు తాడికొండలో మట్టి తరలిస్తున్న టిప్పర్లు, ట్రాక్టర్లు -
తాడికొండ టీడీపీలో భగ్గుమన్న విభేదాలు..!
సాక్షి, గుంటూరు: తాడికొండ టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ తీరుకు వ్యతిరేకంగా జడ్పీ వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో అసంతృప్త నేతలు సమావేశం నిర్వహించారు. ఈసారి తాడికొండ టీడీపీ టికెట్ శ్రావణ్కుమార్కు టికెట్ ఇవ్వొద్దని ఈ సమావేసంలో తీర్మానం చేశారు. అందరికీ ఆమోదయోగ్యుడైన అభ్యర్థికి సీటు ఇవ్వాలని వారు అధిష్టానాన్ని తీర్మానంలో కోరారు. -
ఉవ్వెత్తున మంటలు..
-
సబ్స్టేషన్లో అగ్నికీలలు
* 100 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ పేలి భారీగా మంటలు * రూ.75 లక్షల నష్టం * జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం తాడికొండ రూరల్: తాడికొండ అడ్డరోడ్డు వద్ద ఉన్న 132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో బుధవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సాయంత్రం 6.30 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించి ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. తాడికొండ, పొన్నెకల్లు పరిసర ప్రాంతవాసులకూ అగ్నికీలలతో పాటు భారీగా ఎగసిపడుతున్న పొగ కనిపించింది. సమాచారం అందుకున్న ట్రాన్స్కో ఎస్ఈ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకొని 100 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్లో మంటలు ఎగసిపడినట్లు గుర్తించారు. సుమారు దీని విలువ రూ.50 నుంచి 75 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. కాగా సకాలంలో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు యత్నించినప్పటికీ విఫలం కావడంతో రెండు ఫైరింజన్లు రంగంలోకి దిగాయి. అనంతరం వర్షం కూడా తోడవడంతో 8.30 గంటలకు కొంతమేరకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పూర్తిగా మంటలు ఆరిపోతే కానీ ప్రమాదం ఎందుకు జరిగిందో తెలుసుకొనే పరిస్థితి లేదని ఎస్ఈ తెలిపారు. జిల్లాలో మూడొంతుల విద్యుత్ సరఫరా ఇక్కడి నుంచే జరుగుతుంది కనుక కొంత మేరకు ఇబ్బంది తప్పదని చెప్పారు.