Big Shock To BJP In Nagarjunasagar Byelection: BJP Leader Kadari Anjaiah Joins TRS Party In KCR’s Presence - Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి బీజేపీ నేత అంజయ్య

Mar 30 2021 7:04 PM | Updated on Mar 30 2021 9:32 PM

Nagarjunasagar ByElection BJP Leader Kadari Anjaiah Joins TRS Party - Sakshi

సాగర్‌ ఉపఎన్నిక బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ అసంతృప్తి నేత కడారి అంజయ్య ఆ పార్టీకి షాక్‌ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి చేరారు.

సాక్షి, హైదరాబాద్‌: సాగర్‌ ఉపఎన్నిక బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ అసంతృప్తి నేత కడారి అంజయ్య ఆ పార్టీకి షాక్‌ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి చేరారు. కాగా చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన అభ్యర్థుల ఖరారు అంశంలో బీజేపీ ఆచితూచి వ్యవహరించి, రవికుమార్‌(ఎస్టీ వర్గం)కు టికెట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో, అంజయ్య మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆయనను సంప్రదించి చర్చలు జరుపగా ఆయన టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్‌లో​ బీజేపీ డిపాజిట్‌ కోల్పోయింది. అప్పుడు ఆ పార్టీ తరఫున బరిలోకి దిగిన నివేదితారెడ్డికి 2,675 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి, ప్రస్తుతం బీజేపీ నుంచి టికెట్‌ ఆశించిన అంజయ్య  27,858 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
సాగర్‌ ఉప ఎన్నిక: బీజేపీకి భారీ షాక్‌
హైదరాబాద్‌: రోడ్డు పైకి వెళ్తున్నారా? తస్మాత్‌ జాగ్రత్త!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement