మా నాన్నకు 50 ఏళ్లు.. పింఛన్‌ ఎప్పుడిస్తారు! | Muslim Family Gives Shock To TDP Leaders In Kurnool District, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

మా నాన్నకు 50 ఏళ్లు.. పింఛన్‌ ఎప్పుడిస్తారు!

Jul 4 2025 8:48 AM | Updated on Jul 4 2025 11:19 AM

Muslim Family Gives Shock To Tdp Leaders In Kurnool District

విష్ణువర్ధన్‌రెడ్డిని ప్రశ్నిస్తున్న ముస్లిం కుటుంబం

సి.బెళగల్‌: ‘యాభై ఏళ్లకే పింఛన్‌ ఇస్తామన్నారు.. మా నాన్నకు ఇంతవరకు పింఛన్‌ రాలేదు. పింఛన్‌ ఎప్పుడిస్తా­రు?’అంటూ కర్నూలు జిల్లా సి.బెళగల్‌లో ఓ ముస్లిం కుటుంబం కేడీసీసీ బ్యాంకు చైర్మన్, కోడుమూరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి విష్ణువర్ధన్‌రెడ్డిని ప్రశ్నించింది. సి.బెళగల్‌లో  టీడీపీ నాయకులు గురువారం తొలిఅడు­గు కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కోట వీధి­లో­ని అబ్దుల్‌ సత్తార్‌ ఇంటికి టీడీపీ నాయకులతో కలి­సి వెళ్లిన విష్ణువర్ధన్‌రెడ్డిని అబ్దుల్‌  కుమార్తెలు తమ తండ్రికి 50 ఏళ్ల పింఛన్‌ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రశ్నింనంచారు. దీనితో టీడీపీ నాయకులు కొంత ఇబ్బంది పడ్డారు.

అదే­ విధంగా గ్రామ ప్రధాన రోడ్డు, మురికి కాలువలు, మంచినీటి ట్యాంక్‌ నిర్మాణాల వంటి డిమాండ్లూ గ్రామస్తుల నుంచి వచ్చాయి. కాగా,  ఎంపిక చేసిన కొన్ని ఇళ్లను మా­త్ర­మే టీడీపీ నాయకులు సందర్శిస్తున్నారని విమర్శ­లు వినిపిస్తున్నాయి. కార్యక్రమంలో స్థానిక ఎమ్మె­ల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement