‘వినేవాళ్లు తెలుగు తమ్ముళ్లైతే.. చెప్పేవాడు చంద్రబాబు’ | MLA Kodali Nani Fires On Chandrababu And Yello Media | Sakshi
Sakshi News home page

‘వినేవాళ్లు తెలుగు తమ్ముళ్లైతే.. చెప్పేవాడు చంద్రబాబు’

Feb 19 2024 7:31 PM | Updated on Feb 19 2024 8:28 PM

MLA Kodali Nani Fires On Chandrababu And Yello Media - Sakshi

గుడివాడ: చంద్రబాబు, ఎల్లో మీడియాపై మరోసారి ధ్వజమెత్తారు ఎమ్మెల్యే కొడాలి నాని. చంద్రబాబు అండ్‌ కంపెనీ ఇష్టంమొచ్చినట్లు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లడంపై కొడాలి నాని తనదైన శైలిలో కౌంటరిచ్చారు. వినేవాళ్లు తెలుగు తమ్ముళ్లైతే... చెప్పేవాడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. 

‘ఇప్పటి వరకూ అభ్యర్ధుల్ని ,ఇంఛార్జ్‌లను ఏడు విడతల్లో జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. అభ్యర్ధుల్ని మార్చేచోటే మార్పులు చేర్పులు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీలో  సీట్ల మార్పులు జగన్‌మోహన్‌రెడ్డి చేస్తారు.. ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్‌ నాయుడు, మహాటీవీ వంశీ కాదు. నరేంద్రమోదీకి కూడా గుడివాడలో ఏబీఎన్‌ రాధాకృష్ణ టికెట్‌ ఇవ్వగలడు. నన్ను ఓడించాలంటే చంద్రబాబును తెచ్చి గుడివాడలో పోటీచేయమనండి. గుడివాడలో నేను పోటీచేయాలో లేదో జగన్‌మోహన్‌రెడ్డి చెబుతారు.. టీవీ5, ఏబీఎన్‌, మహాన్యూస్‌పకోడీగాళ్లు కాదు. ఏబీఎన్ రాధాకష్ణ,బీఆర్ నాయుడు పోటీచేస్తారని  నేను కూడా ఫ్లెక్సీలు పెట్టిస్తా ... నిజమైపోతుందా?

... గన్నవరంలో వంశీని, గుడివాడలో నన్ను మారుస్తామని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారా?, మా సీట్లు ఇవ్వడానికి ఈ ఏబీఎన్..టివి5,మహాటీవీ బఫూన్ గాళ్లు ఎవరు?, పక్కలేస్తే సీట్లివ్వడం...డబ్బులకు అమ్ముకోవడం వైఎస్సార్‌సీపీలో ఉండదు. వంద కోట్లుంటే చంద్రబాబు టీడీపీలో టిక్కెట్లిస్తాడు. మా మైలవరం అభ్యర్ధికి ఎకరం పొలం తప్ప ఏమీ లేదు. వైఎస్సార్‌సీపీలో  ఒకడు ట్రైచేస్తేనో... బ్రోకర్ గాడు చెబితేనే టిక్కెట్లు రావు. సామాజిక సమీకరణాల ప్రకారమే ఎస్సీ,బీసీ,ఎస్టీ ,మైనార్టీలకు జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశారు.చంద్రబాబుకు దమ్ముంటే..మగాడైతే బీసీలకు ఎక్కువ సీట్లివ్వాలి. సీట్లు మారుస్తాడా లేదా.. అనేది మాకు జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించిన వ్యవహారం. మధ్యలో టీడీపీ బ్రోకర్లకు పనేంటి.

.... ఏబీఎన్ రాధాకృష్ణ బ్రోకర్ పనులు టీడీపీలో చేసుకోమనండి. జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేక పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి. ఎంతమంది కలిసొచ్చినా జగన్‌మోహన్‌రెడ్డిని ఎదిరించలేరు. జగన్‌ సింగిల్‌గా వస్తానని చెబుతున్నాడు. మీరెందుకు ఒకరి సంక మరొకరు ఎక్కుతున్నారు. చంద్రబాబు పర్మినెంట్‌గా మాజీగానే ఉంటాడు. పదిలక్షల మంది జనం వచ్చిన చోట ఆంధ్రజ్యోతి పేపర్ ఫోటో గ్రాఫర్ కు పనేంటి. ఏబీఎన్‌ను, వాళ్ల పేపర్ ను మేం బ్యాన్ చేశాం.. ఎవరు రమ్మన్నారు. రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ,బీఆర్ నాయుడు మా సభలకు మీ లోగోలు తీసుకురావొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మీరు మా సభలకు వస్తే మా కార్యకర్తలు మీ కాలుకు కాలు విరిచేస్తారు’ అని కొడాలి నాని విమర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement