నడి రోడ్డు మీద బీజేపీ నేతల కుమ్ములాట | Internal Differences Within Secunderabad BJP Leaders | Sakshi
Sakshi News home page

రోడ్డు మీద సికింద్రాబాద్‌ బీజేపీ నేతల ఘర్షణ

Dec 20 2020 4:31 PM | Updated on Dec 20 2020 6:52 PM

Internal Differences Within Secunderabad BJP Leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ బీజేపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయి చేరాయి. నడి రోడ్డు మీదే బీజేపీ నేతలు ఘర్షనకు దిగారు. తార్నాక డివిజన్‌ అధ్యక్షుడు రాముపై శారదా మల్లేష్‌ దాడి చేశారు. దీంతో నేతలిద్దరు రోడ్డుపైనే ఘర్షణకు దిగారు. ఒకరినొకరు దూషించుకుంటూ హంగామా చేశారు. ఈ పంచాయితీ కాస్త బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఇంటికి చేరింది. ఇరువర్గాల కార్యకర్తలు భారీగా రామచంద్రరావు ఇంటికి చేరుకున్నారు. తార్నాక డివిజన్ లాలాపేట్‌లో జరిగిన బీజేపీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో తార్నాక డివిజన్ అధ్యక్షుడు రాము ప్రోటోకాల్ ప్రకారం తనను స్టేజీపైకి ఆహ్వానించలేదనే కోపంతోనే శారదా మల్లేష్‌ ఆ దాడికి దిగినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement