టీఎంసీ గూటికి దిగ్గజ టెన్నిస్‌ క్రీడాకారుడు | Goa Polls 202: Leander Paes And Actor Nafisa Ali Join TMC | Sakshi
Sakshi News home page

టీఎంసీ గూటికి దిగ్గజ టెన్నిస్‌ క్రీడాకారుడు

Oct 29 2021 5:30 PM | Updated on Oct 29 2021 5:34 PM

Goa Polls 202: Leander Paes And Actor Nafisa Ali Join TMC - Sakshi

రాజకీయాల్లో ప్రవేశించి దేశ ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను

Leander Paes Join TMC కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై ఘన విజయం సాధించిన టీఎంసీ.. గోవాలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. గోవాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఇక పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం టీఎంసీలోకి వలసలు భారీగా పెరిగాయి. రాజకీయ నాయకులతో పాటు.. సెలబ్రిటీలు కూడా టీఎంసీలో చేరుతున్నారు. 

తాజాగా ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారుడు లియాండర్‌ పేస్‌ టీఎంసీలో చేరారు. ఆయనతో పాటు నటి నసిఫా అలీ, సామాజిక కార్యకర్త మృణాళిని దేశప్రభు శనివారం టీఎంసీలో చేరారు. ఈ విషయాన్ని టీఎంసీ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. వీరంతా మమతా బెనర్జీ సమక్షంలో వీరు పార్టీలో చేరినట్లు ప్రకటించారు.

(చదవండి: ‘ఈ సైకిల్స్‌’ ఆవిష్కరణలో పేస్‌ ఇలా పడిపోయాడేంటి?)

టీఎంసీలో చేరిన అనంతరం లియాండ్‌ పేస్‌ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం నేను టెన్నిస్‌ నుంచి రిటైర్‌ అయ్యాను. రాజకీయాల్లో ప్రవేశించి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను. దేశంలో మార్పు తీసుకురావాలనుకుంటున్నాను. దీదీ నిజమైన చాంపియన్‌’’ అన్నారు. 

చదవండి: జేమ్స్‌ బాండ్‌ 007 పేరుతో ప్రధాని మోదీపై విమర్శలు

Advertisement
 
Advertisement
Advertisement