పార్టీలకతీతంగా రైతులకు న్యాయం చేయండి: సీదిరి అప్పలరాజు | Ex Minister Seediri Appalaraju Comments On Chandrababu Government | Sakshi
Sakshi News home page

పార్టీలకతీతంగా రైతులకు న్యాయం చేయండి: సీదిరి అప్పలరాజు

Jun 27 2024 2:24 PM | Updated on Jun 27 2024 2:28 PM

Ex Minister Seediri Appalaraju Comments On Chandrababu Government

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి సర్కార్‌ పనిచేయాలని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.

సాక్షి, శ్రీకాకుళం: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి సర్కార్‌ పనిచేయాలని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నో అంచనాలతో కూటమికి ప్రజలు పట్టం కట్టారు. కూటమి సర్కార్‌పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దన్నారు.

‘‘విత్తనాల పంపిణీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. పార్టీలకతీతంగా రైతన్నలకు న్యాయం చేయాలి. వైఎస్సార్‌సీపీ హయాంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగింది’’ అని అప్పలరాజు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement