‘ముందు హామీ ఇచ్చి.. తర్వాత మీతో పనిలేదన్నారు’ | Chandrasekhar Reddy Slams Babu Govt Over Volunteer System | Sakshi
Sakshi News home page

‘ముందు హామీ ఇచ్చి.. తర్వాత మీతో పనిలేదన్నారు’

Apr 8 2025 5:12 PM | Updated on Apr 8 2025 5:52 PM

Chandrasekhar Reddy Slams Babu Govt Over Volunteer System

తాడేపల్లి:  వాలంటీర్లీ వ్యవస్థను కొనసాగిస్తామని గతేడాది ఉగాది సందర్భంగా హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు.. గెలిచిన తర్వాత వారితో పని లేదని పక్కన పెట్టేశారని వైఎస్సార్‌సీపీ ఎంప్లాయిస్, పెన్షనర్ల వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్ చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘ జగన్ 2 లక్షల 66 వేల మందితో వాలంటీర్ వ్యవస్థ తెచ్చారు. ప్రజలకు ఇంటివద్దకే సేవలు అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒకలా వచ్చిన తర్వాత మరోలా మాట్లాడుతున్నారు వాలంటీర్లకు 5వేలు కాదు 10 వేలిస్తామన్నారు. వాలంటీర్లను కొనసాగిస్తామని గత ఉగాది రోజు చంద్రబాబు మాటిచ్చి...ఇప్పుడు మాటమార్చేశారు

విజయవాడ వరదల్లో వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకున్నారు. వరద తగ్గాక మీతో మాకు పనిలేదన్నారు. ప్రభుత్వం నుంచి వాలంటీర్లకు వేతనాలివ్వలేదని వైఎస్సార్‌సీపీపై నిందలు వేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థకు ఎలాంటి ఆధారాల్లేవని పవన్ మాట్లాడటం విడ్డూరం. ప్రభుత్వం వాలంటీర్లకు వేతనాలిచ్చిన సంగతి కూడా ఒక మంత్రిగా పవన్ కు తెలియదా?, వాలంటీర్ల నియామకం పై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎంత వేతనమివ్వాలో కూడా స్పష్టం చేసింది. డిప్యూటీ సీఎంగా ఉండి కూడా పవన్ అబద్ధాలాడటం హాస్యాస్పదం. దేశంలో ఎక్కడాలేని విధంగా వాలంటీర్ వ్యవస్థను జగన్ తెచ్చారు. కోవిడ్ సమయంలో వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివి వాలంటీర్ల పై చంద్రబాబు, పవన్, టీడీపీ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలే. వాలంటీర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. 10 వేల వేతనం ఇచ్చితీరాల్సిందే. పవన్ ను కలిసేందుకు వాలంటీర్లు వెళితే పోలీసులను పెట్టి జులుం ప్రదర్శించారు

వాలంటీర్లకు ఏం చేయలేకపోతే....చేయలేమని చెప్పండి. మీ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలైనా పీఆర్సి ప్రకటించలేదు. ప్రభుత్వం రాగానే ఐఆర్ ఇస్తామని చెప్పారు. ఐఆర్ కోసం ఉద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. నిరుద్యోగులకు జాబ్  ఇస్తామన్నారు..ఏమైంది జాబ్ క్యాలెండర్

ప్రైవేట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయలేదు. ఉద్యోగులు, నిరుద్యోగులు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. రాబోయే క్యాబినెట్ లో పెండింగ్ డీఏ , పీఆర్సీ,ఐఆర్ పై ప్రకటన చేయాలి’ అని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement