పొలిటికల్‌ హీట్‌.. ‘కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ కొంటున్నారు’ | BJP MP Bandi Sanjay Sensational Comments Over KCR | Sakshi
Sakshi News home page

రేవంత్‌ ప్రభుత్వానికి మేము సహకరిస్తాం.. బండి సంజయ్‌ ఆసక్తికర కామెంట్స్‌

Jan 14 2024 12:48 PM | Updated on Jan 14 2024 1:04 PM

BJP MP Bandi Sanjay Sensational Comments Over KCR - Sakshi

సాక్షి, కరీంనగర్‌: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మాజీ సీఎం కేసీఆర్‌ ప్లాన్‌ చేస్తున్నారని బండి సంజయ్‌ కామెంట్స్‌ చేశారు. 

ఇక, తాజాగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్‌ ప్లాన్‌ చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ టచ్‌లో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో కేసీఆర్‌ కోవర్టున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాతే ఏదైనా జరగొచ్చు. కోవర్టులకు గత ఎన్నికల్లో కేసీఆర్‌ భారీగా డబ్బులు ఇచ్చారు. తెలంగాణ కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సహకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. 

బీఆర్‌ఎస్‌ అంటే కూల్చే పార్టీ.. బీజేపీ అంటే నిర్మించే పార్టీ. భద్రాద్రి ఆలయానికి వచ్చి తలంబ్రాలు తీసుకురాలేనోళ్లు బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయితే ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పోటీ చేయడం లేదు?. తెలంగాణలోనే ఆ పార్టీకి అభ్యర్థులు దిక్కులేరు. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో ఉండాల్సింది మోదీ సర్కారే. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తేనే తెలంగాణకు అధిక నిధులు వస్తాయి’ అని కామెంట్స్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement