BJP Chief Bandi Sanjay Fire On KCR Government And MIM | Telangana - Sakshi
Sakshi News home page

‘తెలంగాణను శ్రీలంకలా మారుస్తున్నారు’: బండి సంజయ్‌

Aug 25 2022 10:52 AM | Updated on Aug 25 2022 11:27 AM

BJP Bandi Sanjay Fire On KCR Government And MIM - Sakshi

సాక్షి, తెలంగాణ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. మరోవైపు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రపై సస్పెన్స్ కొనసాగుతుంది. హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. 

ఈ నేపథ్యంలో బండి సంజయ్‌.. కేసీఆర్‌ సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. బండి సంజయ్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన సీఎం కేసీఆర్‌.. శాంతి భద్రతల సమస్యను సృష్టించడం సిగ్గుచేటు. తెలంగాణను శ్రీలంకలా మార్చేస్తున్నారు. మేధావులు నిర్బంధాలను గమనించాలి. కేసీఆర్‌ కుటుంబ అవినీతిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 

ప్రజల దృష్టి మళ్లించేందుకే టీఆర్‌ఎస్‌ గందరగోళం సృష్టిస్తోంది. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు టీఆర్‌ఎస్‌ కుట్ర చేస్తోంది. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కుట్రలను ప్రజలు గమనించాలి. మతవిద్వేషాలు రెచ్చగొడుతూ ఎంఐఎం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది. అన్ని మతాల వాళ్లు బాగుండాలని బీజేపీ కోరుకుంటుంది’ అని తెలిపారు. 

ఇది కూడా చదవండి: ముడిచమురు ధర తగ్గినా పెట్రో ధరలు తగ్గించరా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement