
AP Elections Political Latest Updates Telugu
9:30PM, Jan 23, 2024
నేను ఒంగోలు నుంచే పోటీ చేస్తున్నాం: బాలినేని
- ఇళ్ల స్థలాలు కోసం రూ. 231 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్కు కృతజ్ఞతలు
- ఇళ్ల పట్టాల విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వడమే మా లక్ష్యం
- ఫిబ్రవరి 10లోపు అక్కాచెల్లెమ్మలకు చీరలు పెట్టి స్థలాలు పంపిణీ చేస్తాం
6:00PM, Jan 23, 2024
లోకేష్ అరెస్టుకు అనుమతి కావాలన్న సీఐడీ పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారణ
- విచారణను ఈనెల 30కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
- 41ఏ నిబంధనలకు విరుద్ధంగా లోకేష్ వ్యవహరించారని సీఐడీ పిటిషన్
- రెడ్ బుక్లో ప్రభుత్వాధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 41A నిబంధనలకు విరుద్ధంగా లోకేశ్ వ్యవహరిస్తున్నారని సీఐడీ పిటిషన్
- విచారణ తర్వాత 30కు కేసును వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
మాజీ ఐఏఎస్ లక్ష్మీనారయణ పిటిషన్పై ఏసీబీ కోర్టులో విచారణ
- విచారణను ఈనెల 29కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
- చంద్రకాంత్ షా కేసులో సీఐడీ సమర్పించిన డాక్యుమెంట్ల కాపీ కోసం పిటిషన్
- స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అప్రూవర్ గా మారిన చంద్రకాంత్ షా
5:24PM, Jan 23, 2024
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామా ఆమోదం
- గతంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్ కి లేఖ రాసిన గంటా
- స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసిన గంటా శ్రీనివాస్
- స్పీకర్ని కలిసి రాజీనామా ఆమోదించాలని గతంలో కోరిన గంటా శ్రీనివాస్
- గంటా కోరిక మేరకు రాజీనామా ఆమోదించిన స్పీకర్
4:23PM, Jan 23, 2024
ఏపీలో షర్మిల రాక.. మరొక నాన్లోకల్ పొలిటీషియన్ వచ్చినట్లే: మంత్రి ఆర్కే రోజా
- రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్కు ఓటు అడిగే హక్కు లేదు
- వైఎస్సార్ చనిపోయిన తర్వాత ఆయన పేరున ఎఫ్ఐఆర్లో చేర్చారు
- కాంగ్రెస్ పార్టీ జగన్ను 16 నెలలు జైల్లో పెట్టించింది
4:16PM, Jan 23, 2024
‘సైకిల్’ పార్టీలో కుమ్ములాటలు
- సాలూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల వర్గపోరు
- సొంతపార్టీలోనే ఒకరి ఫ్లెక్సీలు మరొకరు చించుకోవడంతో బయటపడ్డ వర్గ విభేదాలు
- సాలూరు మండలం మామిడిపల్లిలో గ్రామంలో టీడీపీ నేతల కుమ్ములాట
- శంబర జాతరకు సందర్భంగా టీడీపీ నాయకురాలు తేజోవతి కూడాఫ్లెక్సీలు ఏర్పాటు
- వీటిని చింపేసిన మరొక వర్గం
- ఆ స్థానంలో మరో టీడీపీ నాయకురాలు సంధ్యారాణి ఫ్లెక్సీలు అతికింపు
- టీడీపీ ఇలా దిగజారిపోయిందేమిటని ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు
3:25PM, Jan 23, 2024
సీఎం జగన్ పేదల పక్షపాతి: ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి
- రైతులు, డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారు
- పేదలకు 3 సెంట్లు భూమి ఇస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు
- అన్ని వర్గాలకు న్యాయం చేసిన నాయకుడు సీఎం జగన్
- సీఎం జగన్ మోహన్ రెడ్డి పేదల కోసం బటన్ నొక్కితే.. చంద్రబాబు పేదలకు టోపీ పెట్టాడు
- చంద్రబాబు.. లోకేష్ కోసం మాత్రమే బటన్ నొక్కాడు
- ఎమ్మెల్సీ నుండి మంత్రిని చేశాడు .. ప్రజలు బటన్ నొక్కితే లోకేష్ మంగళగిరిఓడి పోయాడు
- చంద్ర బాబు భవిష్యత్తు గ్యారెంటీ అంటాడు అబ్బా కొడుకులకే గ్యారెంటీ లేదు
- అమ్మకు వందనం అని మనకు సున్నం పెట్టాలనీ చూస్తున్నాడు
- పేదల పక్షాన నిలిచే జగనన్న కావాలా.. పెత్తందారుల పక్కన నిలిచే చంద్రబాబు కావాలో ఆలోచించండి
3:05PM, Jan 23, 2024
సీఎం జగన్ సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నారు: ఎమ్మెల్యే పిన్నెల్లి
- నరసరావుపేట ఎంపీ సీటును బీసీలకు కేటాయించాలని భావించారు
- లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు నుంచి పోటీ చేయమని పార్టీ చెప్పింది
- లావు శ్రీకృష్ణదేవరాయలు ఎందుకు పార్టీకి రాజీనామా చేశారో తెలియదు
- ఎవరైనా సరే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే
2:55PM, Jan 23, 2024
సామాజిక న్యాయం అమలులో భాగంగానే అనేక మార్పులు: గోపీరెడ్డి శ్రీనివాస్రెడ్డి
- నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఓసీ అభ్యర్థులే అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు
- సామాజిక న్యాయం చేసేందుకే బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలని పార్టీ నిర్ణయం
- దాంతో శ్రీకృష్ణదేవరాయలు విభేదించారు
- బీసీ, ఎస్సీ, ఎస్టీలు అధికంగా చట్టసభలకు రావాలనేది సీఎం జగన్ ఆలోచన
02:40 PM, Jan 23, 2024
నేను బ్రతికున్నంత వరకు సీఎం జగన్ వెంటే నడుస్తా: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
- ఎల్లో మీడియా నా మీద కుట్రతో తప్పుడు ప్రచారం చేస్తోంది
- నా జీవితాంతం వైఎస్సార్, వైఎస్ జగన్ వెంటే నడిచాను
- చంద్రబాబు దళిత వ్యతిరేకి.. సీఎం జగన్ దళిత పక్షపాతి
- నా శవాన్ని కూడా టీడీపీకి తాకే అర్హత లేదు
- ఈ రాష్ట్రంలో దళితుడిని డిప్యూటీ సీఎం చేసిన ఒకే ఒక్క నాయకుడు జగన్
- చంద్రబాబుకి, ఎల్లో మీడియాకి అంబెడ్కర్ పేరు ఎత్తే అర్హత కూడా లేదు
- అంబెడ్కర్ 100 అడుగుల విగ్రహం పెడతానని పెట్టకుండా చంద్రబాబు అవమానించారు
01:45 PM, Jan 23, 2024
హమ్మ.. ఎల్లో మీడియా..! ఇంత కుతంత్రమా.?
- ఆస్థాన విద్వాంసుడు జడ శ్రవణ్ను పక్కనబెట్టిన ఎల్లోమీడియా
- ఇటీవల అమరావతి విషయంలో చంద్రబాబును నిలదీసిన శ్రవణ్
- చంద్రబాబు, లోకేష్ వల్లే అమరావతి రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరాలతో ప్రకటించిన శ్రవణ్
- మూడు పంటలు పండే భూములను అన్యాయం చేశారని ఆవేదన
- ఎప్పుడయితే చంద్రబాబును ప్రశ్నించాడో.. అప్పటినుంచి జడ శ్రవణ్ను దూరం పెట్టిన ఎల్లోమీడియా
- ఇదే విషయాన్ని మీడియాకు వివరించిన మాజీ జడ్జి రామకృష్ణ
- చంద్రబాబును తిట్టగానే శ్రవణ్ను దూరం చేస్తారా? ఎల్లో మీడియాకు మాజీ జడ్జి రామకృష్ణ ప్రశ్న
01:23 PM, Jan 23, 2024
గజ దొంగల ముఠా రోజూ అబద్ధాలు, మోసాలే: సీఎం జగన్
- చంద్రబాబుకు తోడు ఎల్లో మీడియా
- చంద్రబాబు, ఎల్లో మీడియాకు తోడు దత్త పుత్రుడు
- చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు దండిగా ఉన్నారు
- చంద్రబాబును భూజాన ఎత్తుకుని మోసే ముఠా చాలా మంది ఉన్నారు
- చంద్రబాబుకు పక్క రాష్ట్రంలో అనేక మంది పర్మినెంట్ స్టార్ క్యాంపెయినర్లు
- రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి వెళ్లిన చంద్రబాబు అభిమాన సంఘం కూడా స్టార్ క్యాంపెయినర్
- ముగ్గురు మీడియా అధిపతులు చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్లు
- అమరావతిలో చంద్రబాబు భూములకు బినామీలు ఉన్నట్టే..
- మనుషుల్లోనూ, ఇతర పార్టీలో కూడా స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు
- పలు వేదికలపై విశ్లేషకులు, మేధావుల పేర్ల మీద వీళ్లే కనిపిస్తారు
- దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడంలో వీళ్లంతా భాగస్వాములే
- రోజూ ఇలాంటి వారికి సమాధానం ఇవ్వాల్సి రావడమే నిజంగా కలికాలం అనిపిస్తుంది
- ప్రతి ఇంట్లోనూ జరిగిన మంచి కనిపిస్తోంది
- అయినా రోజూ అబద్ధాలు, ఎక్కువ మంది వాళ్లవైపు ఉన్నారు కాబట్టి, టీవీ చానళ్లు ఉన్నాయి కాబట్టి రోజూ అబద్దాలతో వడ్డించడం, దానికి కూడా సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అంటే దీన్నే కలికాలం అంటారు
- ఏ మంచీ చేయకపోయినా, ఏ స్కీములూ ఆయన అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు.
- బాబు కోసం చంద్రబాబును భుజానికెత్తుకొని మోసే ముఠా. చాలా మంది ఉన్నారు.
- మన రాష్ట్రంలో ఎవరూ ఉండరు. వాళ్లు ఇళ్లు, కాపురాలు,సంసారాలు పక్క రాష్ట్రంలో ఉంటాయి
- పక్క రాష్ట్రంలో పర్మినెంట్ రెసిడెంట్గా ఉన్న దత్తపుత్రుడు స్టార్ క్యాంపెయినర్ అయితే, చంద్రబాబు వదినగారు.. ఆమె పక్కపార్టీలోకి వెళ్లి చంద్రబాబుకు మరో స్టార్ క్యాంపెయినర్. ఆయన వదిన అంటే అందరికీ తెలిసే ఉంటుంది
- పక్క రాష్ట్రంలో శాశ్వతంగా ఉంటున్న ముగ్గురు మీడియా అధిపతులు. అక్కడున్న ఆ మీడియా అధిపతులు ఓ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5. వీళ్లంతా బాబుకు స్టార్ క్యాంపెయినర్లే
- వీళ్లుకాక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతున్న ఇంకొంత మంది స్టార్ క్యాంపెయినర్లు.. వీళ్లంతా చంద్రబాబుకు తోడుగా ఉన్నారు
- బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్న.. అంది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్న పసుపు కమలాలన్నీ కూడా ఇంకొంత మంది బాబుకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు
- అమరావతిలో బాబు భూములకు బినామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ, ఇతర పార్టీల్లోనూ రకరకాల రూపాల్లో చంద్రబాబుకు బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగా కొనసాగుతున్నారు
- టీవీలు ఆన్ చేస్తే విశ్లేషకుల పేరిట కనిపిస్తారు, వేదికల పేరు మీద, మేధావులు అని చెప్పుకుంటూ కనిపిస్తారు
- రక రకాల స్టార్ క్యాంపెయినర్లు బాబు కోసం పని చేస్తారు. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడంలో వీళ్లందరూ భాగస్వాములే
- ఏ అభివృద్ధీ చేయని వారికి, ప్రజలకు ఏ మంచీ చేయని వారికి, ప్రజలకు మోసాలే చేసిన వారికి ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంత మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు గానీ, ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, ప్రతి పేద ఇంటికీ మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లూ లేరు
- కానీ మీ బిడ్డ వీళ్లందరినీ నమ్ముకోలేదు. వీళ్లందరికీ ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాడు
- వీళ్లందరికన్నా ఎక్కువ స్టార్ క్యాంపెయినర్లు మీ బిడ్డకు ఉన్నారని చెప్పడానికి సంతోషపడుతున్నాడు
- మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరో తెలుసా? ఈ జెండాలు జతకట్టిన వారంతా అనుకుంటున్నారు.. మీ బిడ్డకకు స్టార్ క్యాంపెయినర్లు లేరని.. వారికీ నాకూ తేడా ఏమిటో తెలుసా? కుట్రలు, కుతంత్రాలతో జెండాలు జతకట్టడమే వారి ఎజెండా.. జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా..
- కాబట్టే వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు, దేశ చరిత్రలోనే కాదు.. రాజకీయ చరిత్రలోనే ఎవరూ ఉండరని ఈ సందర్బంగా తెలియజేస్తున్నా.
- మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు.. ఆ మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లూ.. ఆ ప్రతి ఇంట్లో ఉన్న నా అక్కచెల్లెమ్మలందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే
- ఒక వైఎస్సార్ ఆసరా అందుకున్న నా అక్కచెల్లెమ్మలంతా 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలు మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే
- సున్నావడ్డీ అందుకున్న కోటి మందికిపైగా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే
- 57 లక్షల మంది తల్లులు, కోటికిపైగా ఉన్న ఆ పిల్లలు వీళ్లంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే
- చేయూత అందుకున్న 31 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలు వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే
- 31 లక్షల మంది ఇళ్ల పట్టాలందుకున్న నా అక్కచెల్లెమ్మలు, వాళ్ల కుటుంబాలు, అందులో 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న ఈ కుటుంబాలన్నీ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే
- రైతు భరోసా అందుకుంటున్న అరకోటికిపైగా ఉన్న 52 లక్షల మంది ఆ రైతన్నలందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే
- నెలనెలా పెన్షన్లు అందుకుంటున్న 65 లక్షల మంది నా అవ్వాతాతలు, నా వికలాంగులు, వికలాంగ సోదరులు, అక్కచెల్లెమ్మలు, వితంతు అక్కచెల్లెమ్మలు వీళ్లందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే
- ఆరోగ్యశ్రీ ద్వారా మంచి జరిగిన 30 లక్షల మంది కుటుంబాలు వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే
- దిశ యాప్ ద్వారా రక్షణ పొందుతున్న అక్కచెల్లెమ్మలందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే
- ఇంగ్లీషు మీడియం ద్వారా బడులు, బతుకులు మారుతున్నాయని అర్థం చేసుకున్న గవర్నమెంట్ బడి పిల్లలు, వారి తల్లిదండ్రులంతా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే
- గ్రామంలో వచ్చిన మార్పులు కళ్లారా చూసిన గ్రామీణ ప్రజలందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే
- ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ ఆదివారమైనా, సెలవురోజైనా ప్రతి నెలా ఒకటో తేదీన సూర్యోదయానికంటే ముందే తలుపుతట్టి గుడ్మార్నింగ్ చెబుతూ పెన్షన్ డబ్బులు అందజేస్తున్న 2.50 లక్షల మంది వాలంటీర్ తమ్ముళ్లు, చెల్లెమ్మలు సేవా సైన్యం కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే
- మన నవరత్నాల పాలనలో ఎలాంటి లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఏకంగా 2.53 లక్షల కోట్లు బటన్ నొక్కగానే అందుకున్న ఆ ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలు మీరే మీ బిడ్డకు శ్రీరామరక్ష అని ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడుతున్నా
- మీ బిడ్డ మిమ్మల్నే నమ్ముకున్నాడు. చంద్రబాబు మాదిరి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడి అండదండలు లేవు
- మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, కింద మిమ్మల్ని తప్ప ఇంకొకర్ని మీ బిడ్డ నమ్ముకోలేదు
- రాబోయే రోజుల్లో అబద్ధాలు మోసాలు చేస్తారు. కేజీ బంగారం ఇస్తామంటారు. ప్రతి ఇంటికీ బెంజ్ కారు కొనిస్తామంటారు. ఆలోచన చేయమని కోరుతున్నా
- మీ ఇంట్లో మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే స్టార్ క్యాంపెయినర్లుగా రండి అని మిమ్మల్నందరినీ కోరుతున్నా. మీ బిడ్డకుసైనికులుగా మీరే నిలబడండి
- జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామంలో మనం వేసే ఓటు, మనం నొక్కే బటన్ ఎందుకు నొక్కుతున్నారో గుర్తుపెట్టుకోవాలి
- జగన్ను ముఖ్యమంత్రిగా చేసుకోవడం కాదు మీరు వేసే ఓటు.. ఆ ప్రతి పేద కుటుంబం పేదరికం నుంచి బయట పడాలి అంటే మీరు వేసే ఆ ఓటు వల్ల ఆ జగన్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటేనే జరుగుతుందన్న వాస్తవాన్ని మర్చిపోకండని గుర్తు చేస్తున్నా
- మంచి చేసే అవకాశం, పరిస్థితులు ఇంకా ఎక్కువ దేవుడు ఇవ్వాలి, మీ పిల్లల బతుకులు ఇంకా బాగుపడాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా.
12:20 PM, Jan 23, 2024
సీఎం జగన్ గొప్ప ప్రజాస్వామిక వాది: వై.విశ్వేశ్వరరెడ్డి
- డ్వాక్రా మహిళల రూ.25 వేల కోట్ల అప్పును తీర్చిన ఘనత సీఎం జగన్దే:
- వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం టీడీపీ నేతలకు కనిపించడంలేదు
- కులాలు, మతాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక సీఎం జగన్
- వైఎస్సార్సీపీ కండువా వేసుకున్న వారికి మాత్రమే సంక్షేమ పథకాలు ఇస్తామంటే టీడీపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీల్లో ఒక్కరైనా ఉండేవారా?
- ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అమరావతిలో భూములు కొనుగోలు చేశారు
- వేలాది మంది పేదలకు ఇంటి పట్టాలు రాకుండా పయ్యావుల కేశవ్ అడ్డుకున్నారు
- టీడీపీ నేత పయ్యావుల కేశవ్కు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలు గుర్తొస్తారు
- సీఎం జగన్ పాలనలో కరవు ప్రాంతాలు సస్యశ్యామలం అయ్యాయి
12:14 PM, Jan 23, 2024
చంద్రబాబు కుయుక్తులను ప్రజలు నమ్మరు: దేవినేని అవినాష్
- కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేసే వ్యక్తి చంద్రబాబు
- నాడు ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టి పార్టీని లాక్కున్నారు
- నేడు వైఎస్సార్ కుటుంబంలో చిచ్చుపెట్టే భాగంగానే షర్మిలను ఏపీకి రప్పించారు
- రాష్ట్ర ప్రజల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి
- చంద్రబాబు కుయుక్తులు నమ్మేస్థితిలో ఆంధ్ర ప్రజలు లేరు
- చంద్రబాబు, ఎల్లో మీడియా ఎన్ని కుతంత్రాలు పన్నినా వైఎస్సార్ను ప్రజల గుండెల నుంచి వేరు చేయలేరు
11:51 AM, Jan 23, 2024
నంద్యాలలో టీడీపీకి షాక్
- భారీ ఎత్తున వైఎస్సార్సీపీలో చేరిన నంద్యాల టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు
- సంగంపాడు గ్రామస్తులంతా వైఎస్సార్సీపీలోకి
- శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డి సమక్షంలో చేరిక కార్యక్రమం
11:46 AM, Jan 23, 2024
మొదలైన షర్మిల యాత్ర
- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల రాష్ట్రవ్యాప్త యాత్ర ప్రారంభం
- శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కిన షర్మిల
- షర్మిలతో పాటు బస్సులో మాణిక్కం ఠాగూర్, గిడుగు, రఘువీరా రెడ్డి
- పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు బస్సులో ప్రయాణం
- బస్సులో ప్రయాణికులతో ముఖాముఖి
- ఎల్లుండి ఏలూరులో కొనసాగనున్న యాత్ర
11:41 AM, Jan 23, 2024
అమరావతి పేరుతో ప్రజలను చంద్రబాబు మభ్య పెట్టాడు: వెల్లంపల్లి శ్రీనివాస్
- విజయవాడ అభివృద్ధికి చంద్రబాబు ఒక రూపాయి ఖర్చుపెట్టిన దాఖలాలు లేవు
- సీఎం జగన్ ప్రభుత్వంలో కోట్ల రూపాయలు వెచ్చించి కృష్ణలంక రిటైనింగ్ వాల్, ఆర్ఓబి, బ్రిడ్జిలు అభివృద్ధి చేశాం
- గతంలో బోండా ఉమా సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధిని తుంగలో తొక్కాడు
- అవినీతికి, కబ్జాలకు అక్రమ కట్టడాలకు కేరాఫ్ అడ్రస్ టీడీపీ నేత బోండా ఉమా
- బోండా ఉమాను సెంట్రల్ నియోజకవర్గం ప్రజలు తిరస్కరించారు
- చంద్రబాబు మోసపూరిత రాజకీయాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు
- సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలిచి సీఎం జగన్కు గిఫ్టుగా ఇస్తాం
మైనార్టీల అభ్యున్నతికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్సీ రుహుల్లా
- మసీదుల అభివృద్ధికి ముందు అడుగు వేసింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే
- చంద్రబాబు గతంలో దుర్మార్గపు రాజకీయాలకి పాల్పడ్డాడు
- సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు
- చంద్రబాబు ముందు నీ కొడుకుని అదుపులో పెట్టుకో
- ఎన్నికల సమయంలో నీ కొడుకు ఎన్ని సీట్లు అమ్ముకున్నాడో ప్రజలందరికీ తెలుసు
బోండా ఉమాకు ఓట్లు కావాలి కానీ ప్రజల సంక్షేమం అవసరం లేదు: డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి
- విజయవాడ సెంటర్ నియోజకవర్గంలో 150 కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి దక్కింది
- టీడీపీ నాయకులు గల్లి గల్లికి వెళ్లి పోసుకోలు కబుర్లు చెబుతున్నారు
- టిడ్కో ఇళ్లు ఇప్పిస్తామని టీడీపీ నేతలు లబ్ధిదారుల వద్ద రూ. 25 వేలు నుంచి రూ.50 వేలు దోచుకున్నారు
- ప్రజల సొమ్ము ఎంత బొక్కారో అందరికీ తెలుసు
- టీడీపీ నేతలు చేసిన పాపాలు వాళ్ల వెంటే తిరుగుతాయి
11:07 AM, Jan 23, 2024
పీకే క్లారిటీ.. పచ్చ బ్యాచ్ గుండె బద్దలు
- నిజంగా పచ్చ బ్యాచ్ గుండె బద్ధలయ్యే వార్త ఇది
- వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తమ పార్టీతో పని చేస్తారని ఎల్లో బ్యాచ్ గంపెడు ఆశలు
- చంద్రబాబుతో కలిసి పని చేసేది లేదని కుండబద్ధలు కొట్టేసిన పీకే
- చంద్రబాబు, లోకేష్తో పీకే భేటీ కావడాన్ని బాహుబలి, కేజీఎఫ్ రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ వస్తోంది ఎల్లో మీడియా
- ఈ మేరకు బాబు కోసం.. టీడీపీ కోసం పీకే పని చేస్తారని.. ప్రస్తుతం చర్చలు కూడా జరుగుతున్నాయంటూ ఊహాజనిత కథనాలు
- తాజాగా ఓ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ దీనిపై స్పష్టత
- చంద్రబాబు తన కోసం ఎన్నికల్లో పని చేయమని అడిగాడు.. అందుకు తాను కుదరదని చెప్పా
చంద్రబాబు తన కోసం ఎన్నికల్లో పని చేయమని అడిగాడు, నేను చేయను అని చెప్పాను - #PrashantKishor
— Actual India (@ActualIndia) January 23, 2024
దీనికి పచ్చ మీడియా అల్లిన కథలు
ఇచ్చిన బిల్డప్పులు అబ్బబ్బబ్బబ్బ …. pic.twitter.com/chshlt6REG
10:49 AM, Jan 23, 2024
సైకిలెక్కితే సైడ్ట్రాకే!
- టీడీపీలో చేరి చతికిలపడ్డ ‘సీమ’ హేమాహేమీలు..
- కోట్ల, భూమా కుటుంబాలకు గెలుపు పూర్తిగా దూరం
- గౌరు, బుడ్డాతో పాటు వరదరాజులరెడ్డి, ఆదినారాయణరెడ్డి పరిస్థితీ అంతే
- టీడీపీని నమ్మి చేరిన పలువురికి టికెట్ నిరాకరణ
- ఒకప్పుడు సీమ రాజకీయాల్లో పేరొందిన ఆ రాజకీయ నేతలు
- చంద్రబాబు పంచన చేరి వంచనకుగురై చతికిలపడ్డారు
- సైకిలెక్కి తప్పుచేశామని, బాబు నిండాముంచేశారని తెరవెనుక గగ్గోలు
- కోట్ల.. భూమా.. గౌరు.. బుడ్డా కుటుంబాలకు చెందిన రాజకీయ నాయకులతోపాటు నంద్యాల వరదరాజులరెడ్డి, దేవగుడి ఆదినారాయణరెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్, వైఎస్సార్సీపీలో బలమైన నేతలు
- చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మి టీడీపీలో చేరితే ‘సీమ’ రాజకీయాల్లో తెరమరుగయ్యే స్థితికి చేరారు
- చంద్రబాబును నమ్మి వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన మరికొంతమంది కనీసం టికెట్ దక్కించుకోలేక మోసపోయారు
- వీరిలో కొందరు తిరిగి వైఎస్సార్సీపీలో చేరారు
- చంద్రబాబు మోసం గ్రహించి ‘సీమ’లో టీడీపీ పని ఖతమైందని తెలుసుకున్న కొందరు..
- ఆ పార్టీలో ఉండి ఓడిపోవడం కంటే మౌనంగా ఉండటం మంచిదనే నిర్ణయానికి వచ్చారు
- ఈసారి తాము కోరిన టికెట్ ఇవ్వకపోతే పోటీనుంచి తప్పుకోవాలనే భావనలో మరికొందరు
10:08 AM, Jan 23, 2024
ఎన్నికలతో సంబంధం ఉన్న.. అధికారులను 25లోగా బదిలీ చేయండి
- ఒకే ప్రాంతంలో మూడేళ్లు పనిచేసిన వారిని ట్రాన్స్ఫర్ చేయండి
- ఓటర్లలో విభిన్న ప్రతిభావంతుల కోసం ర్యాంపులు ఏర్పాటు చేయాలి
- సీఈవో, జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో ఖాళీలను త్వరగా భర్తీ చేయండి
- సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై సమీక్షలో సీఎస్ జవహర్ రెడ్డి
9:52 AM, Jan 23, 2024
దొంగ ఓట్లకు ఆద్యుడు బాబే
- శాసన మండలిలో విప్ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజం.. పక్క రాష్ట్రాల ఓటర్లను చేర్చేందుకు టీడీపీ డ్రైవ్ చేపట్టింది
- జనసేన పోటీ చేసే చోట
- టీడీపీ ఓట్లు వేరే చోటకు బదిలీ
- టీడీపీ మై డాష్ బోర్డ్పై చర్యలు తీసుకోవాలని కోరాం
- 10 లక్షల ఓట్లను తొలగించేందుకు కోనేరు సురేష్ దరఖాస్తు
8:44 AM, Jan 23, 2024
‘ఆనం’దం ఆవిరి
- నెల్లూరు టీడీపీలో ఆధిపత్యపోరు
- వెంకటగిరిలో చంద్రబాబు సభ సాక్షిగా విభేదాలు బహిర్గతం
- ‘రా.. కదలిరా’ సభకు ‘ఆనం’ను ఆహ్వానించని సోమిరెడ్డి, రవిచంద్ర
- ఆనం, కోటంరెడ్డిలతో బస్సులో బాబు ఏకాంత చర్చలు
- సోమిరెడ్డి, రవిచంద్రలపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు
- సోమిరెడ్డికి చీవాట్లు పెట్టి వెళ్లిపోయిన బాబు
8:30 AM, Jan 23, 2024
మిత్ర ధర్మమిదేనా ‘బాబూ’!
- జనసేనతో సీట్ల సర్దుబాటు ఖరారు కాకున్నా టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు పిలుపు
- మండపేటలో మండిపడుతున్న జనసేన క్యాడర్
- టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం
- ఓ వైపు జనసేనతో పొత్తు ఉందని చెబుతారు..
- మరోవైపు తమ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిస్తారు..
- ఇదీ బాబు మార్కు మిత్ర ధర్మం
- రానున్న ఎన్నికల్లో టీడీపీ – జనసేన మధ్య పొత్తు ఉందని ఇరు పార్టీల అధినేతలూ ప్రకటించారు
- కానీ సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక ఇప్పటివరకూ కొలిక్కి రాలేదు
- అయినప్పటికీ టీడీపీ చేపట్టిన ‘రా.. కదలి రా’ సభల్లో మాత్రం తమపార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ చంద్రబాబు పిలుపు
- జనసేన నేతలకు, ఆశావహులకు మింగుడుపడడం లేదు
8:01 AM, Jan 23, 2024
చంద్రబాబు ఏసీబీ కోర్టు కేసులు..
- అప్రూవల్గా మారిన నిందితుడు ఏసీఐ ఎండి శిరీష్ చంద్రకాంత్ షాను విచారించే క్రమంలో కేసుకు సంబంధించి ఇప్పటికే డాక్యుమెంట్లు అడిగిన చంద్రబాబు న్యాయవాదులు
- కేసులో సీఐడి కోర్టు సమర్పించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరిన చంద్రబాబు తరపున న్యాయవాదులు
- దీనిపై పిటీషన్ దాఖలు చేయాలని చంద్రబాబు తరుపున న్యాయవాదులకు అదేశించిన కోర్టు
- అప్పటి వరకు శిరీష్ చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ రికార్డు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
- చంద్రబాబు తరపున న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్పై ఈ రోజు ఏసీబీ కోర్టులో విచారణ
- స్కిల్ కేసులో అప్రూవర్గా మారుతున్నట్లు ఇప్పటికే ఏసీబీ కోర్టులో చంద్రకాంత్ షా పిటీషన్
- బోగస్ ఇన్వాయిస్లతో నిధులు స్వాహా చేశారని కోర్టుకి ఆధారాలు సమర్పించిన చంద్రకాంత్ షా
- స్కిల్ కేసులో చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన ఏ-22 నిందితుడు యోగేష్ గుప్తా నిధుల అక్రమ తరలింపులో కీలక పాత్రగా పేర్కొన్న చంద్రకాంత్ షా
- స్కిల్ కేసులో ఎ- 26 నిందితుడు సావన్ కుమార్ జజూతో కలిసి యోగేష్ గుప్తా 2016 లో తనని కలిసారన్న చంద్రకాంత్ షా
- డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీలకి సాఫ్ట్ వేర్ సమకూర్చినట్లుగా బోగస్ ఇన్వాయిస్లు ఇవ్వాలని వారు కోరినట్లు పిటీషన్ లో పేర్కొన్న చంద్రకాంత్ షా
- ఏసీఐ కంపెనీ తరపున స్కిల్లర్ కంపెనీకి 18 బోగస్ ఇన్వాయిస్లు, డిజైన్ టెక్కి రెండు బోగస్ ఇన్వాయిస్లు ఇవ్చానన్న చంద్రకాంత్ షా
- బోగస్ ఇన్వాయిస్లు ఇచ్చినందుకు రూ.65 కోట్లు తన కంపెనీ ఖాతాలో నిధులు జమచేశారని పిటిషన్
- అవే నిధులను సావన్ కుమార్ చెప్పిన పలు డొల్ల కంపెనీలకి మళ్లించానన్న చంద్రకాంత్ షా
- ఆ 65 కోట్ల నిధులనే టీడీపీ ఖాతాలోకి చేరినట్లుగా ఇప్పటికే సీఐడీ గుర్తింపు
- అడ్డంగా దొరికిపోవడంతో చంద్రకాంత్ షా వాంగ్మూలం అడ్డుకునేందుకు చంద్రబాబు తరపు న్యాయవాదుల అభ్యంతరాలు
- నేడు ఏసీబీ కోర్డులో కొనసాగనున్న విచారణ
7:52 AM, Jan 23, 2024
నారా లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ
- ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు లోకేష్కి రిజిస్టర్ పోస్టులో నోటీసులు పంపిన సీఐడీ
- ఏసీబీ కోర్టు ముందు హాజరై స్వయంగా కానీ, న్యాయవాది ద్వారా వివరణ ఇవ్వాలన్న ఏసీబీ కోర్టు
- యువగళం ముగింపు రోజున లోకేష్ కోర్టు ధిక్కార వ్యాఖ్యలపై గత నెలలో ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సీఐడీ
- లోకేష్ కోర్టు ధిక్కార వ్యాఖ్యలని ఆధారాలతో సహా ఏసీబీ కోర్టు ముందు ఉంచిన సీఐడీ
- లోకేష్కి NBW వారెంట్ జారీ చేయాలని పిటీషన్లో పేర్కొన్న సీఐడీ
- యువగళం ముగింపు సందర్బంగా పలు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూల్లో లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
- కేసు దర్యాప్తుని ప్రభావితం చేసేలా లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
- కోర్టు ఆదేశాలని ధిక్కరించేలా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ పిటీషన్ లో పేర్కొన్న సీఐడీ
- చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని.. చంద్రబాబుకి రిమాండ్ విదించడం తప్పని వ్యాఖ్యానించిన లోకేష్
- ఏసీబీ న్యాయమూర్తికి దురుద్దేశాలని ఆపాదించే విధంగా లోకేష్ వ్యాఖ్యలున్నాయంటూ మెమోలో పేర్కొన్న సీఐడీ
- స్కిల్ స్కామ్, ఐఆర్ఆర్, ఫైబర్ నెట్ స్కాం తదితర కేసులలో అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారని.. తమ అభ్యంతరాలని పట్టించుకోలేదని టీడీపీ ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులు ఇప్పటికే న్యాయమూర్తి ఎదుట 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలాలు
- ఆ వాంగుల్మాలు ఇవ్వడాన్ని తప్పుబడుతూ లోకేష్ వ్యాఖ్యలు
- అధికారులు 164 సీఆర్పీసీ క్రింద వాంగ్మూలం ఎలా ఇస్తారని....రెడ్ బుక్ లో పేర్లు రికార్డు చేశానని.. తమ ప్రభుత్వం వస్తే వారి సంగతి తేలుస్తానంటూ లోకేష్ హెచ్చరిక
- సాక్షులని బెదిరించి కేసు దర్యాప్తుని పక్కదారి పట్డించాలని లోకేష్ ఉద్దేశంగా మెమోలో పేర్కొన్న సీఐడీ
- గతంలో లోకేష్కి జారీ చేసిన 41ఏ నోటీసుల్లో పేర్కొన్న షరతులకి విరుద్దమన్న సీఐడీ
- కేసు విచారణలో భాగంగా లోకేష్కి నోటీసులు అందజేయాలని ఏసీబీ కోర్టు ఆదేశం
- సీఐడీ నోటీసులు తీసుకోకపోవడంతో ఏసీబీకోర్టు సీరియస్
- రిజిస్టర్ పోస్టులో నోటీసులు పంపాలని ఆదేశం
- 23న కోర్టు ముందు లోకేష్ లేదా ఆయన తరపు న్యాయవాది హాజరై వివరణ ఇవ్వాలన్న ఏసీబీ కోర్టు
7:27 AM, Jan 23, 2024
చీరాలలో బడుగుల జాతర
- ఘనంగా వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర
- కదం తొక్కిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు
- మళ్లీ జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే తమ జీవితాల్లో వెలుగులుంటాయని నినాదాలు
- బహిరంగ సభకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలు
- అంబేడ్కర్, పూలే ఆశయాల సాధకుడు సీఎం జగన్: మంత్రి నాగార్జున
- దేశ చరిత్రలో అంబేడ్కర్, పూలే, సాహూ మహరాజ్, పెరియార్, వంటి మహనీయుల ఆశయాలను సాకారం చేస్తున్నది సీఎం జగన్ మాత్రమే
- సీఎం జగన్ ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక విప్లవం సాధించారు అన్నారు
- చంద్రబాబు కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయంగా ఎదిగారు
- జగన్ మాత్రం అంబేడ్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకొచ్చారు
- పేద పిల్లలను ఇంగ్లిష్ మీడియం చదివించారు
- వారికి విదేశాల్లో చదివే అవకాశాలు కల్పించి ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేశారు
- అంబేడ్కర్ విగ్రహాన్ని చంద్రబాబు ముళ్లపొదల్లో పడేస్తే..
- వైఎస్ జగన్ విజయవాడ నడిబొడ్డులో నిలబెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీలు తల ఎత్తుకునేలా చేశారు
- తెలంగాణలో పార్టీని పెట్టి, ఏపీతో సంబంధం లేదని చెప్పిన షర్మిల..
- ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి చంద్రబాబు కుట్రలో పావుగా మారారు
- సీఎం జగన్ దళిత క్రైస్తవులను ఎస్సీలుగా చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు
వైయస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జగనన్న ప్రభుత్వానికి జై కొట్టారు. ఈ సందర్భంగా సీఎం @ysjagan గారు నాలుగున్నరేళ్లలో చేసిన మంచిని వైయస్ఆర్సీపీ నాయకులు ప్రజలకు వివరించారు. #SamajikaSadhikaraYatra… pic.twitter.com/dbhY40ZY9y
— YSR Congress Party (@YSRCParty) January 22, 2024
7:21 AM, Jan 23, 2024
నేడు ‘వైఎస్సార్ ఆసరా’ పంపిణీ
- నేడు రూ.6,394.83 కోట్ల నాలుగో విడత ‘వైఎస్సార్ ఆసరా’ పంపిణీ
- 79 లక్షల మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సీఎం జగన్ సర్కార్ భరోసా
- 2019 ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మొత్తం అప్పు రూ.25,571 కోట్లు
- ఇందులో మూడు విడతల్లో ఇప్పటికే రూ.19,175.97 కోట్లు చెల్లింపు
- నేటి నుంచి ఆఖరిదైన నాలుగో విడత మొత్తం జమ
- అనంతపురం జిల్లా ఉరవకొండలో నేడు లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
- ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో రెండు వారాలపాటు ఉత్సవంలా కార్యక్రమాలు
- ప్రజల్లో తనపట్ల ఉన్న విశ్వసనీయత, నమ్మకాన్ని మళ్లీమళ్లీ చాటుకుంటున్న జగన్
- చంద్రబాబు నిర్వాకంతో కుదేలైన సంఘాలన్నీ మళ్లీ గాడిలోకి..
- సర్కారు చర్యలతో పొదుపు సంఘాల ఎన్పీఏలు 18.36 శాతం నుంచి 0.17 శాతానికి తగ్గుదల
7:13 AM, Jan 23, 2024
‘తూర్పు’ బరిలో డిష్యుం..డిష్యుం
- నివురుగప్పిన నిప్పులా టీడీపీలో విభేదాలు
- తోడైన జనసేన వర్గాలు
- అధినేత చంద్రబాబు వైఖరితో అగ్నికి మరింత ఆజ్యం
- గోపాలపురంలో మద్దిపాటిని వ్యతిరేకిస్తున్న బాపిరాజు
- బాబు వద్ద తేలని పంచాయితీ
- నిడదవోలులో టీడీపీ అభ్యర్థిత్వంపై అయోమయం
- కొవ్వూరులో ఎస్సీ నేత, మాజీ మంత్రి జవహర్ను పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టి అవమానం
- రాజానగరం జనసేనకంటూ..
7:12 AM, Jan 23, 2024
అచ్చన్నకు చెక్ పెట్టిన బాబు, లోకేష్
- పేరుకే అధ్యక్ష పదవి .. బీసీ నేతకు ఘోర అవమానాలు
- పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేసిన చంద్రబాబు, లోకేశ్
- అధ్యక్షుడి పనులన్నీ వర్ల రామయ్య ఇతర నేతలతో చేయిస్తున్న వైనం
- మీడియా సమావేశాలు పెట్టడానికీ అనుమతి లేదు
- అడపాదడపా ఒకటి, రెండు సమావేశాలకే పరిమితం
- బాబాయ్ని తొక్కిపెట్టి, అబ్బాయి రామ్మోహన్ని పైకి లేపుతున్న లోకేశ్
- లోలోన రగిలిపోతున్న అచ్చెన్నాయుడు
7:07 AM, Jan 23, 2024
వైఎస్సార్సీపీలో ఫుల్ జోష్
- ఎన్నికల సమరానికి రెడీ
- ఏలూరులో కొత్త అభ్యర్థుల పరిచయ సభ గ్రాండ్ సక్సెస్
- టీడీపీలో ఇంకా కొనసాగుతున్న సీట్ల గందరగోళం
- పొత్తులపై అయోమయం, అభ్యర్థుల అన్వేషణలో జాప్యం
- ప్రజాక్షేత్రంలో కలియదిరుగుతున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులు
- నియోజకవర్గాలవారీగా పార్టీ శ్రేణులతో వరుస సమావేశాలు
7:05 AM, Jan 23, 2024
ఏపీ ఓటర్లు 4.08 కోట్లు
- ఈ దఫా పురుషులు 2.01 కోట్లు.. మహిళలు 2.07 కోట్లు
- 2019తో పోలిస్తే రాష్ట్రంలో 15 లక్షలు అదనంగా పెరిగిన ఓటర్లు
- అత్యధికంగా కర్నూలు జిల్లాలో 20.16 లక్షల ఓటర్లు..
- అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 7.61 లక్షల ఓటర్లు
- 80 ఏళ్లు నిండినవారు, దివ్యాంగులు, కోవిడ్ బాధితులకు ఇంటి వద్దే ఓటు హక్కు
- 80 ఏళ్లు నిండిన ఓటర్లు 5,76,791.. దివ్యాంగులు 4,87,594 మంది
- ప్రతి 1,500 మందికి ఒక పోలింగ్ స్టేషన్.. మొత్తం 46,165కు స్టేషన్లు
- ప్రతి తొలగింపు, చేరికలను ఇంటింటి సర్వే చేసి పరిశీలించాం
- నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తులు సమర్పించిన 70 మందిపై ఎఫ్ఐఆర్లు
- 2024 తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా
చంద్రబాబుకు చివరి అస్త్రం షర్మిలనే..
— YSR Congress Party (@YSRCParty) January 21, 2024
ఏపీలో ఆమె ఎవరికి ఆయుధంలా ఉపయోగపడాలని వచ్చారో అందరికీ తెలుసు
అందుకే ఎల్లో మీడియా షర్మిలను భుజానికి ఎత్తుకుంటోంది
-వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి#MorusupalliSharmila pic.twitter.com/yvlQ3gOgep
6:56 AM, Jan 23, 2024
చంద్రబాబుకు చివరి అస్త్రం షర్మిలనే: సజ్జల రామకృష్ణారెడ్డి
- వైఎస్సార్ ఆలోచనలకు అనుగుణంగా జగన్ పనిచేస్తున్నారు
- కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి, వైఎస్సార్ కుటుంబానికి అన్యాయం చేసింది
- వైఎస్ జగన్పై కాంగ్రెస్ అక్రమ కేసులు పెట్టింది
- వైఎస్ జగన్పై పెట్టినవి అక్రమ కేసులని గులాం నబీ ఆజాదే చెప్పారు
- వైఎస్సార్ పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు
- వైఎస్ మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులను కాంగ్రెస్ ఇబ్బందులకు గురి చేసింది
- షర్మిల నిన్నటి వరకు తెలంగాణలో ఏం చేశారు?
- షర్మిల.. తెలంగాణ నుంచి హఠాత్తుగా ఏపీకి ఎందుకొచ్చారు?
- రాష్ట్రంలో ఉనికిలేని పార్టీ కాంగ్రెస్
- షర్మిల వాడిన భాష బాగోలేదు
- కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసు?
- గత ఎన్నికల్లో కాంగ్రెస్కు నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి
- ఆ పార్టీ తరఫున షర్మిల ఇక్కడకు వచ్చి ఏం చేస్తారు?
- చంద్రబాబును ఎలా సీఎం చేయాలన్నదే షర్మిల లక్ష్యంగా కనిపిస్తోంది
- చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసింది
- తెలంగాణలో పోటీ చేస్తానన్న షర్మిల ఎందుకు వెనకడుగు వేశారు?
- ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంది
- చంద్రబాబుకు చివరి అస్త్రం షర్మిలనే
- చంద్రబాబు ప్రతీరోజూ చేసే విమర్శలే ఇప్పుడు షర్మిల చేస్తుంది
- వైఎస్ అభిమానుల ఓట్లు చీలితే కొద్దిగా కలిసి వస్తుందనే ఆశతో చంద్రబాబు ఉన్నారు
- ఏపీలో ఎవరికి ఆయుధంలా ఉపయోగపడాలని వచ్చారో అందరికీ తెలుసు
- ఇదంతా చంద్రబాబు ఎత్తుగడే
- అందుకే ఆ వర్గం మీడియా షర్మిలను భుజానికి ఎత్తుకుంది
- వైఎస్సార్ వారసుడిగా ప్రజల హృదయాల్లో జగన్ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు
- రాష్ట్రంలో ఏ వర్గానికి అన్యాయం జరిగినా వైఎస్ జగన్ సహించరు
- రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైఎస్ జగన్ రాజీపడరు
- ప్రత్యేక హోదాని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చట్టంలో చేర్చలేదు?
- షర్మిల కచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందే
- వైఎస్సార్ తనయురాలిగా, వైఎస్ జగన్ చెల్లెలిగా షర్మిలను అభిమానిస్తాం