
మట్టి గణపతి
ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025
మట్టి గణపతిని తయారు
చేస్తున్న రమేశ్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు పర్యావరణ హితమైన మట్టి ప్రతిమల ప్రతిష్ఠకే మొగ్గు చూపుతున్నారు. చిన్నచిన్న విగ్రహాలు మొదలు.. భారీ విగ్రహాల వరకు మట్టి గణపతులనే పూజిస్తామంటున్నారు. నాటి పద్ధతులను ఇప్పటికీ పాటిస్తూ పాతతరంవారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నవరాత్రులు నిర్వహిస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఊరంతా కలిసి ఒకే మండపం ఏర్పాటు చేస్తూ ఐకమత్యాన్ని చాటి చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు కొందరు స్వచ్ఛందంగా మట్టి ప్రతిమలను తయారు చేస్తూ.. వారు ప్రతిష్ఠించడంతో పాటు ఇంటింటా పంపిణీ చేస్తున్నారు. విగ్రహాల తయారీకి కరీంనగర్, కోరుట్ల కేరాఫ్గా మారాయి. ఇక్కడ గంగమట్టితో తయారు చేసిన ప్రతిమలను వివిధ ప్రాంతాలకు చెందిన వారు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని ఒక్కో ప్రాంత మండపానికి ఒక్కో ప్రత్యేకత ఉండగా.. ఈ నెల 27వ తేదీన వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక కథనాలు..
– మరిన్ని కథనాలు 8లోu