
దారి పొడవునా.. దర్జాగా
ముత్తారం(మంథని): ముత్తారం మండలం ఖమ్మంపల్లి ఇసుక క్వారీకి వెళ్లే లారీలు వందల సంఖ్యలో ఇలా నడిరోడ్డుపై నిలపడంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక క్వారీ నుంచి తాడిచెర్లకు వెళ్లే ప్రధాన రోడ్డు వరకు ఇష్టారీతిన నిలుపుతున్నారు. రోడ్డుపై లారీలు నిలపడమేంటని ఎదురుగా వచ్చే వాహనాదారులు ప్రశ్నిస్తే క్వారీ నిర్వాహకులు, డ్రైవర్లు దురుసుగా ప్రవరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఖాళీ స్థలంలో లారీలు నిలపాలని, రోడ్డుపై నిలిపి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చెయ్యొద్దని స్థానికులు కోరుతున్నారు.