సన్నబియ్యంపై స్మగ్లర్ల కన్ను | - | Sakshi
Sakshi News home page

సన్నబియ్యంపై స్మగ్లర్ల కన్ను

Apr 19 2025 9:48 AM | Updated on Apr 19 2025 9:48 AM

సన్నబియ్యంపై స్మగ్లర్ల కన్ను

సన్నబియ్యంపై స్మగ్లర్ల కన్ను

మంథని: ఈ ఏడాది ఉగాది పండుగ నుంచి తెల్లరేషన్‌ కార్డుదారులకు జిల్లా అధికారులు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే, ఈ సన్నబియ్యాన్ని కూడా దొడ్డిదారిన మళ్లించేందుకు అక్రమార్కులు అప్పుడే తమ ప్రయత్నాలు ప్రారంభించారు. రాయితీబియ్యం అక్రమ రవాణాపై పోలీసులు నిఘా తీవ్రతరం చేసినా దందాకు అడ్డుకట్ట పడడంలేదు.

మంథని నుంచి మహారాష్టకు..

జిల్లాలోని మంథనితోపాటు గోదావరిఖని, పెద్దపల్లి సమీప ప్రాంతాల నుంచి సన్నబియ్యం సేకరించే స్మగ్లర్లు మహారాష్ట్రలోని సిరొంచకు తరలిస్తున్నట్లు సమాచారం. చాలాకాలంగా ఈ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. రేషన్‌ దుకాణాల్లో దొడ్డుబియ్యం పంపిణీ చేసిన సమయంలో లబ్ధిదారులు కేజీ రూ.6 – రూ.8చొప్పున డీలర్లకే విక్రయించేవారు. వాటిని రిసైక్లింగ్‌ చేశాక వ్యాపారులు మహారాష్ట్రకు తరలించేవారు. ప్రస్తు తం సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. దీంతో దానికి పాలిసింగ్‌ చేసి తరలిస్తున్నారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో సేకరించిన బియ్యాన్ని తొలు త నిల్వ చేసి ఆ తర్వాత మినీవ్యాన్లు, లారీల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

పెరుగుతున్న వ్యాపారుల సంఖ్య..

జిల్లాలో సన్నబియ్యం దందా చేసే అక్రమ వ్యాపారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రేషన్‌కార్డుదారుల నుంచి సేకరించిన రాయితీ బియ్యాన్ని మహారాష్ట్రలోని సిరొంచ తరలిస్తున్నట్లు గతంలో పట్టుబడిన సందర్భాల్లో వాహన డ్రైవర్లు వెల్లడించిన సమాచారం బట్టి తెలుస్తోంది. సన్నబియ్యం సైతం చాలామంది లబ్ధిదారు లు తినేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో సన్నబియ్యం కూడా బ్లాక్‌ మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

బ్యారేజీ.. వంతెనలే మార్గం

లబ్ధిదారుల నుంచి సేకరించిన బియ్యాన్ని మహారాష్ట్రకు తరలించే క్రమంలో పోలీసులకు చిక్కకుండా అక్రమార్కులు నిఘాలేని మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంథని మండలం సిరిపురం గ్రామ సమీప పార్వతీ బ్యారేజీ నుంచి మంచిర్యాల జిల్లా దాటి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని సరస్వతీ బ్యారేజీ చేరుకుంటున్నారు. అక్కడి వంతెన అటు తర్వాత దామెరకుంట, కాళేశ్వరం, అంతర్‌ రాష్ట్ర వంతెన దాటి మహారాష్ట్రలోకి బియ్యం వ్యాపారులు చేరుతున్నట్లు సమాచారం. మంథని నుంచి వెళ్లే బియ్యం వాహనాల్లో లోడ్‌ అయ్యే వరకూ ఇక్కడి వ్యాపారులు.. ఆ తర్వాత తీసుకెళ్లే బాధ్యత అటువైపు వ్యాపారులు తీసుకొంటున్నారు. దీంతో అక్రమ దందా ‘మూడు లారీలు. ఆరు వ్యాన్లు’ అన్నట్లు యథేచ్ఛగా సాగుతోంది.

లబ్ధిదారుల నుంచి సేకరించే పనిలో దళారులు

రేషన్‌ డీలర్లతో మంతనాలు.. కిలో రూ.15 నుంచి రూ.20

నిఘా పెంచిన పోలీసులు.. కట్టడికి చర్యలు

6ఏ కేసులతో సరిపెట్టకుండా కఠినంగా వ్యవహరించాలంటున్న పేదలు

6– ఏ కేసులతో సరి

జిల్లాలో పలుచోట్ల సబ్సిడీ బియ్యం పట్టుబడుతుంటే అప్పటికప్పుడు అధికారులు 6–ఏ కేసులతో సరిపెడుతున్నారు. ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ వ్యాపారి ఎవరు? అనే కోణంలో విచారణ జరపడంలేదని విమర్శులు ఉన్నాయి. మూలాల్లోకి వెళ్లకపోవడంతో వ్యాపారులు తమ దందా ను ఆపడం లేదు. ఒకట్రెండుసార్లు పట్టుబడితే పీడీ యాక్టులకు అవకాశం ఉన్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. కొందరు వ్యాపారులు బినామీ పేర్లు వెలుగులోకి తెస్తూ కేసులు నమో దు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసులు, సివిల్‌ సప్లయ్‌ అ ధికారులు దృష్టి సారిస్తే అక్రమ దందా ఆపవచ్చనే వాదనలు ఉన్నాయి. అధి కారుల ఉదాసీనతతోనే అక్రమ దందా అడ్డగోలుగా సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయంపై సంబంధిత శాఖల అధికారులను సంప్రదించగా.. సన్నబియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరలించకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్నిచోట్ల నిఘా తీవ్రతరం చేశామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement