క్షణక్షణం ఉత్కంఠ.. ఫైనల్కు చేరాలని, భారత్ గెలవాలని ఆకాంక్ష.. అందరిదీ ఒకే కాంక్ష.. జై భారత్.. జైజై భారత్ నినాదాలు.. గంటల కొద్దీ టీవీలకు అతుక్కుపోయిన యువత.. భారత్–న్యూజీలాండ్ సెమీ ఫైనల్ బుధవారం జరిగింది. ఈ మ్యాచ్ను టీవీల్లో తిలకిస్తూ యువత భారత్ విజయం కోసం ప్రార్థనలు కూడా చేశారు.. వారి ఆకాంక్ష నెరవేరింది.. ఇండియా ఫైనల్కు చేరుకుంది. గోదావరిఖనిలోని ఓ జెంట్స్ పార్లర్లో భారత్ – న్యూజీలాండ్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీలో చూస్తున్న యువత.