మక్కువ మండల వ్యాప్తంగా దాదాపు మూడువేల ఎకరాలమేర వరి సేద్యానికి సిద్ధమయ్యా రు.ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేవు. అదును దాటడంతో వెదలు కుళ్లిపోయాయి. నీరు లేక ఉభాలు సక్రమంగా జరగకపోవడంతో వేలాది ఎకరాల్లో నాట్లు పడలేదు. వెంగళరాయ సాగర్ ద్వారా నీరు అందించలేకపోయారు. తూరుమామి డి, చంద్రయపేట, కొయ్యానపేటలో వరి పంట నీరు లేక బీడుపోయింది. ప్రభుత్వ సహకారం లేదు. బీమా మొత్తాలను రైతులే చెల్లించాలని చెప్పారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలు తాత్కాలిమే. రానున్న కీలక దశలో వానలు కురవకుంటే రైతులు ఆశలు వదులకోవాల్సిందే. –టి.శ్రీనివాసరావు, రైతు,
కంచేడువలస గ్రామం, మక్కువ మండలం


