శారీరక దృఢత్వంతో ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

శారీరక దృఢత్వంతో ఆరోగ్యం

Sep 1 2025 10:03 AM | Updated on Sep 1 2025 10:03 AM

శారీరక దృఢత్వంతో ఆరోగ్యం

శారీరక దృఢత్వంతో ఆరోగ్యం

ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి

జిల్లా కేంద్రంలో ఫిట్‌ ఇండియా సైక్లింగ్‌ ఆన్‌ సండే

పార్వతీపురం రూరల్‌: జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఫిట్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా సైక్లింగ్‌ ఆన్‌ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి జెండా ఊపి సైక్లింగ్‌ ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక ధృడత్వంతోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని తెలిపారు. ప్రజలకు ఈ మేరకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రస్తుతం మన జీవన శైలిలో ప్రతీ రోజు ద్విచక్ర వాహనాలు, కార్లలో ప్రయాణిస్తూ ఆధునిక సౌకర్యాలతో జీవనం సాగిస్తున్నప్పటికీ శారీరక చురుకుదనం లేకపోవడంతో అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందన్నారు. ఈ మేరకు సైక్లింగ్‌ సాధారణ ఆరోగ్య పరిరక్షణ కోసం ఒక సరళమైన, సురక్షితమైన మార్గంతో పాటు పర్యావరణాన్ని కొంతమేరకు కాపాడుకొనేందుకు ఆస్కారం ఉంటుందని ఎస్పీ అన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ జిల్లా కేంద్రం మీదుగా వెళ్లి మళ్లీ మైదానానికి చేరుకుంది. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ థామస్‌ రెడ్డి, ఆర్‌ఐలు రాంబాబు, నాయుడు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు తదితర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement