
ఘోషా ఆస్పత్రి సిబ్బందికి ఎక్స్లెన్స్ అవార్డు
విజయనగరం ఫోర్ట్: ఘోషా ఆస్పత్రి పీపీటీసీటీ సిబ్బందికి సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్లెన్స్ అవార్డు దక్కింది. హెచ్ఐవీ రోగులకు నిరంతరం అందిస్తున్న సేవలను గుర్తించి నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ రాష్ట్రంలోని కొన్ని ఆస్పత్రులను గుర్తించి సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని ఘోషా ఆస్పత్రి పీపీటీసీటీ సిబ్బందికి కూడా అవార్డు ప్రకటించారు. దీంతో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కె. పద్మలీల, ఆస్పత్రి సూపరింటిండెంట్ అప్పలనాయుడు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి కె.రాణి పీపీటీసీటీ కౌన్సిలర్లు ఈ.పద్మావతి, టి. గోపాలరావు, ల్యాబ్ టెక్నీషియన్ గౌరీశంకర్లకు సోమవారం అవార్డు అందజేశారు.