
సివిల్స్ లక్ష్యంగా...
రాజాం సిటీ: రాజాం పట్టణం ఈశ్వరనారాయణకాలనీలో నివసిస్తున్న సారథి గ్రామానికి చెందిన వావిలపల్లి భార్గవ చిన్నప్పటి నుంచి చదువులో చురుకై న విద్యార్థి. ఉన్నత స్థాయిలో స్థిరపడాలన్న ఆయన ఆశయాన్ని తల్లిదండ్రులు ఈశ్వరమ్మ(గృహిణి), విష్ణు (జి.సిగడాం మండలం పాలఖండ్యాం యూపీ పాఠశాల హెచ్ఎం) ప్రోత్సహించారు. ఇంజినీరింగ్ అనంతరం ఉద్యోగాన్వేషణలో వచ్చిన ఉద్యోగాలు కూడా సంతృప్తినివ్వకపోవడం, అధికమందికి సేవచేయాలన్న సంకల్పంతో కఠోర దీక్షతో సివిల్స్ లక్ష్యంగా ప్రయత్నాలు ప్రారంభించించారు. మంగళవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 830వ ర్యాంకు సాధించారు. ఆయన 1 నుంచి 10వ తరగతి వరకు రాజాంలోని శారదా కాన్వెంట్లో చదివి 557 మార్కులు సాధించారు. ఇంటర్మీడియట్ విద్యను స్థానిక వేదగాయత్రి కళాశాలలో పూర్తిచేసి ఎంపీసీలో 948 మార్కులతో ఉత్తీర్ణుడయ్యారు. జీఎంఆర్ ఐటీలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు. తొలిప్రయత్నంలోనే బ్యాంక్ ఆఫ్ బరోడా పీఓగా ఎంపికై నా చేరలేదు. స్టేట్బ్యాంకు క్యాషియర్గా రెండున్నరేళ్లు పనిచేసినా ఆయన తన లక్ష్యాన్ని మరువలేదు. పుస్తకాలతో స్నేహం చేశారు. పట్టదలతో చదివి గ్రూప్–1 పరీక్షలను రాసి రెండో ప్రయత్నంలోనే స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉద్యోగం సాధించారు. అనంతరం అంతిమ లక్ష్యం సివిల్స్పై దృష్టిసారించారు. లక్ష్యసాధనలో మూడు సార్లు యూపీఎస్సీ పరీక్షలు రాసి, ఇంటర్వ్యూలు ఎదుర్కొని నాలుగో ప్రయత్నంలో ర్యాంకు సాధించారు. ఆయన ఎంపిక పట్ల కుటుంబ సభ్యులతో పాటు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
ఆయనే ప్రేరణ..
పదో తరగతి చదువుతున్న సమయంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రేవు ముత్యాలరాజు సివిల్స్కు ఎంపిక కావడంతో ఆయనను ప్రేరణగా తీసుకున్నా. ఎప్పటికై నా సివిల్స్ సాధించడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నాను. మూడు సార్లు ఇంటర్వ్యూకు హాజరై విఫలమైనా నిరుత్సాహపడలేదు. తండ్రి ప్రోత్సాహంతో ముందుకు సాగాను. చివరి ప్రయత్నంలో సివిల్స్లో విజేతగా నిలిచాను.
– వావిలపల్లి భార్గవ, సివిల్స్ 830 ర్యాంకర్

సివిల్స్ లక్ష్యంగా...

సివిల్స్ లక్ష్యంగా...