
విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాల పంపిణీ
విజయనగరం అర్బన్: ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జాతీయ దివ్యాంగుల ఆర్థిక అభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు మరియు వయో వృద్ధులు సహాయ సంస్థ వారి ఆర్థిక సౌజన్యంతో రూ.63 లక్షల విలువ గల రుణాలను 18 మంది దివ్యాంగులకు కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ చేతుల మీదుగా సోమవారం పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ వారి ద్వారా డిగ్రీ ఆపై కోర్సులు రెగ్యులర్గా చదువుతున్న 29 మంది దివ్యాంగులకు రూ.11.60 లక్షలు (ఒక్కొక్కరికి రూ.40 వేలు) 29 ల్యాప్టాప్లు, మూగ, చెముడు అభ్యర్థులకు రూ.60 వేలు విలువ గల 6 టచ్ ఫోన్లు, మూడు చక్రాల సైకిళ్లు 2, వీల్చైర్లు 2, పంపిణీ చేశారు.