
23న సాలూరులో జాబ్మేళా
పార్వతీపురంటౌన్: సాలూరు పట్టణంలోని సత్యసాయి డిగ్రీ కళాశాలలో ఈ నెల 23న ఉదయం 9గంటలకు జాబ్ మేళా జరగనుందని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. నిరుద్యోగ యువత జాబ్మేళాలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, ఏదైనా డీగ్రీ చదువుకుని 18 నిండి 28 ఏళ్లు ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు జాబ్మేళాకు అర్హులని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 9గంటల నుంచి సత్యసాయి డిగ్రీ కళాశాల, సాలూరులో జరిగే జాబ్మేళాకు హాజరుకావచ్చని చెప్పారు. ఈ జాబ్ మేళాకు 11 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారని వివరించారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ యువకులకు తమ వివరాలను హెచ్టీటీీపీఎస్://నైపుణ్యం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్ సైట్లో తప్పనిసరిగా నమోదు చేసుకుని, రిఫరెన్స్ నంబర్తో పాటు బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్, జిరాక్స్, ఒక పాస్పోర్ట్ పొటోతో హాజరు కావాలని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు ఫోన్ 94947 77553, 73825 59022 నంబర్లలో సంప్రదించవచ్చని ప్రకటనలో స్పష్టం చేశారు.
జాతీయ స్థాయి పోటీలకు మన్యం విద్యార్థులు
పార్వతీపురం టౌన్: జాతీయ స్థాయి అండర్–17ధాంగ్–టా పోటీలకు పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు ఎంపికై నట్లు కోచ్ అనిల్ శర్మ తెలిపారు. జిల్లాకు చెందిన ఏడుగురు విద్యార్ధులు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. డిల్లీలో ఈ నెల 22 నుంచి 27 వరకు జరగనున్న పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకువస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
జలవనరుల శాఖ మంత్రి
జిల్లా పర్యటన రేపు
విజయనగరం అర్బన్: రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ నెల 22న జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం నుంచి విజయనగరం చేరుకుని 3.30 గంటలకు నెల్లిమర్ల మండలంలోని తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు ప్రాజెక్టు పనులు, పునరావాసం తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. 6 గంటలకు బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు.

23న సాలూరులో జాబ్మేళా