పోస్టల్‌ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

Mar 17 2025 12:31 AM | Updated on Mar 17 2025 12:32 AM

నెల్లిమర్ల: తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం పొందే పాలసీలను తపాలా శాఖ ప్రవేశపెట్టిందని, పోస్టల్‌ పథకాలను ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా పోస్టల్‌ శాఖ సూపరింటెండెంట్‌ కె.శ్రీనివాసరావు సూచించారు. నెల్లిమర్ల పోస్టాఫీసుని అప్‌గ్రేడ్‌ చేసిన నేపథ్యంలో ఆదివారం ఆ సేవలను ప్రారంభించారు. పోస్టల్‌ శాఖలో నేషనల్‌ సేవింగ్‌ సర్టిఫికెట్‌, ఆర్‌డీ, ఎఫ్‌డీ, సీనియర్‌ సిటిజన్‌, సుకన్య తదితర పథకాలను సద్వినియోగం చేసుకోవా లని పిలుపునిచ్చారు. పోస్టాఫీసులో చిన్నమొత్తాలతో నెలనెల పొదుపు చేసుకోవాలని సూచించారు. ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి పథకం ఎంతగానో ప్రయోజనకరమన్నారు. ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరికి ఇన్సూరెన్సు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ పోస్టల్‌ సేవలను ఉపయోగించుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో పోస్టుమాస్టర్‌ జి.ఎర్రయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పోస్టల్‌ శాఖ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement