మరో ప్రాణం బలి | - | Sakshi
Sakshi News home page

మరో ప్రాణం బలి

Jul 26 2026 2:02 AM | Updated on Jul 26 2026 2:02 AM

మరో ప్రాణం బలి

ఖాకీ కావరానికి

కూటమి పాలనలో ఖాకీల ఇష్టారాజ్యం నడుస్తోంది. పోలీసుల వేధింపులకు మరో నిండు ప్రాణం బలైంది. ప్రేమ వ్యవహారంలో టీపీపీ నేతలకు వత్తాసు పలుకుతూ ఓ సీఐ వేధించడంతో పల్నాడు జిల్లా, అచ్చంపేట మండలం, కొండూరు పంచాయతీ శివారు నిండుజర్లకు చెందిన కడివెళ్ల నాగరాజు (50) సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం ఈ వీడియో వైరల్‌ అయింది. మృతుని బంధువులు తమకు న్యాయం చేసేదాకా మృతదేహాన్ని తీసుకునేది లేదంటూ సత్తెనపల్లి ప్రభుత్వం వైద్యశాల వద్ద ఆందోళన చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కొండమోడు – పేరేచర్ల జాతీయ రహదారిపై శనివారం ఆందోళన నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది.

– అచ్చంపేట /సత్తెనపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement