నమో ఏక దంతాయ! | - | Sakshi
Sakshi News home page

నమో ఏక దంతాయ!

Aug 24 2025 7:29 AM | Updated on Aug 24 2025 12:02 PM

నమో ఏక దంతాయ!

నమో ఏక దంతాయ!

వినాయక చవితి ఉత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు వాడవాడలా సిద్ధమవుతున్న చలువ పందిళ్లు వినాయక ఉత్సవ నిర్వహణలో నిబంధనలు తప్పనిసరి గణేష్‌ ఉత్సవ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి జాగ్రత్తలు పాటించకుంటే ఇబ్బందులు తప్పవు

సత్తెనపల్లి: జిల్లాలో వినాయక చవితి సందడి నెలకొంది. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరునికి తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ప్రజల సిద్ధమవుతున్నారు. గణపతి నవరాత్రుల ఉత్సవాలకు గ్రామాల్లో చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నెల 27న వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఆలయాల వద్ద చలువ పందిళ్లు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవ కమిటీలు పాటించాల్సిన నిబంధనలు ఇలా ఉన్నాయి..

ఆన్‌లైన్‌లో దరఖాస్తులు...

గణేష్‌ మండపాల అనుమతులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

https://ganeshutsav.net సైట్‌ లో ఎంటర్‌ అవ్వగానే న్యూ అప్లికేషన్‌ క్లిక్‌ చేసి, మొబైల్‌ నెంబర్‌ ఎంటర్‌ చేయాలి. ఓటీపీ వెరిఫికేషన్‌ పూర్తయ్యాక దరఖాస్తు విండో ఓపెన్‌ అవుతుంది. దరఖాస్తు ఫారంలో దరఖాస్తుదారుని పేరు, మొబైల్‌ నెంబరు, ఈ–మెయిల్‌ అడ్రస్‌, చిరునామా, అసోసియేషన్‌/కమిటీ పేరు నమోదు చేయాలి. గణేష్‌ మండపం స్థలం, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, ఏ సబ్‌ డివిజన్‌ పరిధిలోకి వస్తుంది. ఏ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి వస్తుంది, ఉత్సవ కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్‌ నెంబర్లు నమోదు చేయాల్సి ఉంటుంది. గణేష్‌ నిమజ్జనం చేసే తేదీ, సమయం, వాహనం, డ్రైవర్‌ వివరాలు నమోదు చేసిన అనంతరం పోలీసులు మండపాన్ని పరిశీలించి, అనుమతులు మంజూరు చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement