‘ప్రత్యేక’ శిబిరాలను సద్వినియోగం చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

‘ప్రత్యేక’ శిబిరాలను సద్వినియోగం చేసుకోండి

Aug 20 2025 5:20 AM | Updated on Aug 20 2025 5:20 AM

‘ప్రత్యేక’ శిబిరాలను సద్వినియోగం చేసుకోండి

‘ప్రత్యేక’ శిబిరాలను సద్వినియోగం చేసుకోండి

● భవిత కేంద్రాల్లో స్పీచ్‌థెరపీ, ఫిజియోథెరపీ, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ అందించడం జరుగుతుందని అంతేకాకుండా భవితా కేంద్రానికి హాజరయ్యే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు అలవెన్స్‌ ఇస్తామన్నారు. ఈ సందర్భంగా యూనిక్‌ డిజేబులిటీ ఐడెంటిటీ కార్డ్‌లను ఆన్‌లైన్‌ చేశారు. ముందుగా ప్రత్యేక అవసరాల చిన్నారులను వైద్యులు పరీక్షించి ఉపకరణాల కోసం నిర్ధారించారు. మొత్తం 120 మంది ప్రత్యేక అవసరాల చిన్నారులు హాజరయ్యారు. ఏఎంఓ ఎన్‌.పూర్ణచంద్రరావు, సత్తెనపల్లి ఎంఈఓలు ఎ.శ్రీనివాసరావు, ఎ.రాఘవేంద్రరావు, భవిత కేంద్రం ఐఈఆర్పీలు ఏవీ శ్రీనివాస్‌, కె.విజయ్‌ కుమారి, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

సహిత విద్య జిల్లా కో–ఆర్డినేటర్‌ సెల్వరాజ్‌

సత్తెనపల్లి: ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు ఉచిత వైద్య నిర్ధారణ శిబిరాలను వినియోగించుకోవాలని సహిత విద్య జిల్లా కో–ఆర్డినేటర్‌ సెల్వరాజ్‌ అన్నారు. పట్టణంలోని సుగాలి కాలనీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో నియోజకవర్గంలోని ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల కోసం విద్యాశాఖ, సమగ్ర శిక్ష పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో అలింకో వారిచే మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య నిర్ధారణ శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సెల్వరాజ్‌ మాట్లాడుతూ జిల్లాలోని 28 భవిత సెంటర్లలో ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు 540 మంది ఉన్నారన్నారు. వీరు కాక ప్రతి మండలంలో సుమారు 100 నుంచి 150 మంది చిన్నారులు ఉన్నారన్నారు. వీరి అవసరాల నిమిత్తం నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ నిర్ధారణ వైద్య శిబిరాలకు మంచి ఆదరణ లభిస్తుందన్నారు. ఈ నెల 18 నుంచి ప్రారంభమైన ఈ శిబిరాలు 25 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈనెల 25న జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో శిబిరం జరుగుతుందన్నారు. బెంగళూరు వైద్యులు అవసరమైన ఉపకరణాలను నిర్ధారించడం జరుగుతుందన్నారు. ఉపకరణాలను త్వరలోనే ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement