
మోసపోయాం.. ఆదుకోండి !
నరసరావుపేట: నా సోదరుడిని విదేశాలకు పంపిస్తామని నమ్మబలికి రూ.15లక్షలు కాజేశారని, రెండేళ్లు గడుస్తున్నా పంపించకుండా మోసం చేశారని పట్టణంలోని పెద్దచెరువు నివాసి నడికుడి పాపారావు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు ఆయన అధ్యక్షత వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, చోరీలు, మోసం సమస్యలకు సంబంధించి 73 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి, సమస్యపై శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించడానికి కృషిచేయాలని అధికారులను ఆదేశించారు.
విదేశాలకు పంపిస్తామంటూ రూ.15లక్షలు కాజేశారు
స్టాఫ్ నర్స్ ఉద్యోగం ఇప్పిస్తామని రూ. 3లక్షల వసూలు
ఆర్థిక నేరాలపై పలు ఫిర్యాదులు అందుకున్న ఎస్పీ
పీజీఆర్ఎస్లో 73 ఫిర్యాదులు స్వీకరణ