కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టాలి

Apr 28 2025 1:15 AM | Updated on Apr 28 2025 1:15 AM

కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టాలి

కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టాలి

మార్కెట్‌ సెంటర్‌లో పలు సంఘాల నాయకులు నిరసన

నరసరావుపేట: కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద చర్యలను నిరసిస్తూ శనివారం లాల్‌బహుదూర్‌ కూరగాయల మార్కెట్‌ వద్ద మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్‌పీఎస్‌) రాష్ట్ర కార్యదర్శి షేక్‌ మస్తాన్‌వలి ఆధ్వర్యంలో పలు సంఘాల నాయకులు నిరసన తెలిపారు. మృతులకు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. దేశంలో ఉగ్రవాదం నశించాలని, దేశ సమైక్యతను కాపాడాలని, పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మస్తాన్‌వలి మాట్లాడుతూ ఉగ్రవాదానికి మతం లేదని, అది ఏ రూపంలో ఉన్నా కూకటివేళ్లతో దేశం నుంచి పెకిలించి వేయాలని కేంద్ర ప్రభుత్వనికి విజ్ఞప్తి చేశారు, పాకిస్తాన్‌ ఉగ్రవాదులను తయారు చేసి దేశంలో అలజడి సృష్టించాలని చూస్తోందని తెలిపారు. మన దేశంలో పాకిస్థాన్‌ ఆటలు సాగబోవని హెచ్చరించారు. ఉగ్రవాదుల చేతులలో అమరులైన కుటుంబలను కేంద్రం ఆదుకోవాలని కోరారు. కాశ్మీర్‌ ప్రజల ధైర్యసాహసాలను ఆయన కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ తీసుకునే ఎటువంటి చర్యలకై నా తమ వంతు మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి షేక్‌ మాబుసుభాని, జిల్లా అధ్యక్షులు రఫీ, జిల్లా కార్యదర్శి ఖాసీం పీరా, ఇమాంసా, ఖాజా మున్నా, సుభాని సయ్యద్‌ బాషా, అర్షద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement