
ద్విచక్ర వాహనం దహనం
నరసరావుపేట టౌన్: ఇంటి బయట నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని దుండగులు దహనం చేసిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతూరులో నివాసం ఉండే గోగుల శ్రీనివాస్ రోజు మాదిరిగానే తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి బయట నిలిపారు. శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి కాలిపోయి కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తులు వాహనంపై పెట్రోలు పోసి తగలబెట్టినట్లు గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ద్విచక్ర వాహనం పక్కనే ఉన్న మరో టీవీఎస్ వాహనానికి కూడా మంటలు వ్యాపించటంతో పాక్షికంగా దెబ్బతింది.