న్యూస్రీల్
గురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
రాయగడ: దక్షిణ ఒడిశా రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరతీసే దిశగా బిజు స్వాభిమాన్ మంచ్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పనిచేసిన ఈ వేదికను ఇక రాజకీయంగా మరింత విస్తరించి, ఎన్నికల రంగంలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు, రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరరావు ప్రకటించారు. స్థానిక తేజస్వీ మైదానంలోని సంస్థ కార్యాలయంలో బుధవారం బిజు స్వాభిమాన్ మంచ్ తొలి వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను బరిలో దింపడం ద్వారా రాజకీయ ప్రస్థానానికి కొత్త మలుపు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసం, కార్యకర్తల అండదండలతోనే సంస్థ తొలి ఏడాదిని విజయవంతంగా పూర్తి చేసుకుందన్నారు. తనపై నమ్మకంతో నిలిచిన ప్రజలు, అనుచరుల ఆశలను వమ్ము చేయకుండా వారి సమస్యలకు అండగా నిలిచేందుకు బిజు స్వాభిమాన్ మంచ్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
సొంత రాజకీయ వేదిక..
బిజు జనతాదళ్లో సుదీర్ఘకాలం క్రియాశీలకంగా పనిచేసిన నెక్కంటి ఆ పార్టీకి గుడ్బై చెప్పి బిజు
పంచాయతీ, మున్సిపల్ బరిలోకి దిగుతాం
బిజు స్వాభిమాన్ మంచ్
వ్యవస్థాపక దినోత్సవంలో
మాజీ ఎంపీ నెక్కంటి
దక్షిణ ఒడిశాలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు శ్రీకారం


