
● తీరని డోలీ కష్టాలు
కొరాపుట్: అనారోగ్యంతో ఉన్న రోగిని డోలీలో తరలించిన సంఘటన జరిగింది. గురువారం కొరాపుట్ జిల్లా దశమంత్పూర్ సమితి లులా గ్రామ పంచాయతీ బారా కౌడీ గ్రామంలో లబి శాంత అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో గిరిజనలు అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. ఆ గ్రామం వెళ్లడానికి మార్గం లేకపోవడంతో అంబులెన్స్ రెండు కిలో మీటర్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో గిరిజనులు మంచాన్ని డోలిగా చేసుకోని బాధితుడిని అంబులెన్స్ వద్దకు చేర్చారు. అంబులైన్లో దశశమంత్పూర్ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు.

● తీరని డోలీ కష్టాలు