5 జిల్లాల్లో త్వరలో 500 మంది ట్రాఫిక్‌ వార్డెన్ల నియామకం | - | Sakshi
Sakshi News home page

5 జిల్లాల్లో త్వరలో 500 మంది ట్రాఫిక్‌ వార్డెన్ల నియామకం

Aug 18 2025 5:45 AM | Updated on Aug 18 2025 5:45 AM

5 జిల్లాల్లో త్వరలో 500 మంది ట్రాఫిక్‌ వార్డెన్ల నియామక

5 జిల్లాల్లో త్వరలో 500 మంది ట్రాఫిక్‌ వార్డెన్ల నియామక

భువనేశ్వర్‌: జిల్లా స్థాయి రోడ్డు భద్రతను బలోపేతం చేయడానికి రాష్ట్ర పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ యోగేష్‌ బహదూర్‌ ఖురానియా అధ్యక్షతన రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర రవాణా అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్‌ నిబంధనల అమలు కట్టుదిట్టం, నిరవధిక జాతీయ రహదారి పహరా, సీసీటీవీ తనిఖీ, అవగాహన కార్యక్రమాలు, పాఠశాల, కళాశాల స్థాయిలో రోడ్డు భద్రతా విద్య వంటి అంశాలపై వివరంగా చర్చించారు. రాష్ట్రంలోని కెంజొహర్‌, మయూర్‌భంజ్‌, సుందర్‌గఢ్‌, గంజాం, ఖుర్ధా జిల్లాల్లో ప్రమాదాల రేటు పెరుగుతోంది. ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై మరణిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ జిల్లాల్లో త్వరలో 500 మంది ట్రాఫిక్‌ వార్డెన్లను నియమించాలని సమావేశంలో నిర్ణయించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్లు వారికి ట్రాఫిక్‌లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తారని డీజీపీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ప్రాధాన్యత కల్పించాలని డీజీపీ తెలిపారు. ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారి వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్లను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల సామాన్యులు ప్రమాదాల బారిన పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని డీజీపీ ఆదేశించారు. ప్రమాదాలలో సామాన్యుల ప్రాణ నష్టాన్ని నివారించడానికి ఉమ్మడి ప్రయత్నాలు చేయాలని జిల్లాలోని ఆర్టీఓ, పోలీసులు మరియు ఇతర శాఖ ఉద్యోగులకు డీజీపీ సూచించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించడం, జాతీయ రహదారులపై నిరవధిక పహరా, కాలి నడక వంతెనలు మరియు భూగర్భ మార్గాల వినియోగం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడం, మద్యం తాగిన డ్రైవర్లపై చర్యలు, సీటు బెల్టులు మరియు హెల్మెట్లు ధరించడం, జాతీయ రహదారుల పక్కన నిలిపి ఉంచిన భారీ వాహనాలపై కఠిన చర్యలు, జాతీయ రహదారులపై ప్రమాద మరణాలను తగ్గించడానికి అంబులెన్స్‌ల మోహరింపు వంటి అంశాలపై వివరంగా చర్చించారు. సమావేశంలో అదనపు పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌ బోత్రా, రాష్ట్ర రవాణా కమిషనర్‌ అమితాబ్‌ ఠాకూర్‌, అదనపు పోలీసు డైరెక్టర్‌ జనరల్‌, రాష్ట్ర రవాణా అథారిటీ అధికారులు పాల్గొన్నారు. ఇన్‌ స్పెక్టర్‌ జనరల్‌ (సెంట్రల్‌) ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌, ఇన్స్పెక్టర్‌ జనరల్‌ (దక్షిణ) నితీష్‌ శేఖర్‌, డీఐజీ (తూర్పు) డాక్టర్‌ సత్యజిత్‌ నాయక్‌, డీఐజీ (పశ్చిమ) బ్రిజేష్‌ కుమార్‌ రాయ్‌, అన్ని జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లు వర్చువల్‌ మాధ్య మం ద్వారా సమావేశంలో పాలుపంచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement