
మే 20 నుంచి ధాన్యం మండీలు ప్రారంభం
కొరాపుట్: ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు (మండీలు) మే 20వ తేదీ నుంచి నబరంగ్పూర్ జిల్లాలో ప్రారంభమవ్వనున్నాయి. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అశోక్ మెహతా కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో నేతృత్వంలో జిల్లా ప్రోక్రిమెంట్ సమావేశం జరిగింది.
మండిల్లో రైతులకు విద్యుత్, తాగునీరు, టార్పాలిన్లు, షెల్టర్, తూకం యంత్రాలు అందుబాటులో ఉంచాలని నబరంగ్పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి అదేశించారు. మొత్తం 40,359 మంది రైతులు తాము పండించిన ధాన్యం విక్రయించనున్నారు. సుమారు 25 లక్షల క్వింటాళ్ల ధాన్యం సేకరణ లక్ష్యం పెట్టుకున్నామని అధికారులు ప్రకటించారు. సమావేశంలో రాజ్యసభ ఎంపీ ప్రతినిధి రబి పట్నాయక్, లోక్సభ ఎంపీ ప్రతినిధి దేవదాస్ మహంకుడో, మిల్లర్ల సంఘం అధ్యక్షుడు ప్రతిప్ మిశ్ర, జడేశ్వర్ ఖడంగా తదితరులు పాల్గొన్నారు.

మే 20 నుంచి ధాన్యం మండీలు ప్రారంభం