
హజ్ యాత్రికుల శిక్షణ శిబిరం ప్రారంభం
కొరాపుట్: కేంద్ర, రాష్ట్రాలలో మత సామరస్యమే తమ ప్రధాన లక్ష్యమని బీజేపీకి చెందిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ, మైనారిటీ, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి నిత్యానంద గొండో ప్రకటించారు. జయపూర్ పట్టణంలోని సంధ్యా పంక్షన్ హాలులో హజ్ యాత్రికుల శిక్షణా శిబిరాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా చరిత్రలో తొలిసారిగా కొరాపుట్లో ప్రభుత్వం హజ్ యాత్రికుల శిక్షణా శిబిరం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. 36 మంది యాత్రికులకు ప్రభుత్వం తరఫున శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జయపూర్ ముస్లిం అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్ మీర్జా ముస్తాఫా బేగ్, బీజేపీ నేత హిమాంశు మహాపాత్రో తదితరులు పాల్గొన్నారు.

హజ్ యాత్రికుల శిక్షణ శిబిరం ప్రారంభం