రత్నం ఫార్మాస్యుటికల్స్‌పై క్రిమినల్‌ కేసు | - | Sakshi
Sakshi News home page

రత్నం ఫార్మాస్యుటికల్స్‌పై క్రిమినల్‌ కేసు

Mar 22 2025 1:44 AM | Updated on Mar 22 2025 1:39 AM

కాలం చెల్లిన మందులు, నిషేధిత

మత్తు సిరప్‌లు లభ్యం

విజయనగరం ఫోర్ట్‌: పట్టణంలోని అంబటి సత్రం జంక్షన్‌లో ఉన్న రత్నం ఫార్మాస్యుటికల్స్‌పై పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఈ దుకాణంపై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ బర్ల ప్రసాద్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి తనిఖీలు చేపట్టగా గడువుదాటిన మందులు, నిషేధిత మత్తు టానిక్‌లు దుకాణంలో లభ్యమయ్యాయి. దీంతో ఈ దుకాణంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మత్తు పదార్థాలు తీసుకుని యువత జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నారు. వెంకటరత్నం మెడికల్‌ దుకాణంలో అధిక మొత్తంలో మత్తు కలిగించే నిషేధిత టానిక్‌లు పట్టుకుని సీజ్‌ చేశామన్నారు. తనిఖీల్లో ఔషధ నియంత్రణశాఖ ఎ.డి రజిత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement