● రెంజల్ జీపీ తీర్మానం
రెంజల్: రెంజల్ మండల కేంద్రంలో బెల్టు షాపులను నిర్వహించొద్దని గ్రామసభలో తీర్మానించారు. సర్పంచ్ తిరుపతి లలిత అధ్యక్షతన గురువారం పంచాయతీ పాలకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు గ్రామంలో సుమారు 20 వరకు బెల్టు షాపులు నిర్వహించడంతో రోడ్లపై రాకపోకలకు మహిళలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎకై ్సజ్ పోలీసులు బెల్టు షాపులను మూసివేయించాలని తీర్మానించారు. కార్యక్రమంలో పాలకవర్గసభ్యులతోపాటు పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.


