‘పనుల జాతర’ పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

‘పనుల జాతర’ పకడ్బందీగా నిర్వహించాలి

Aug 23 2025 12:42 PM | Updated on Aug 23 2025 12:42 PM

‘పనుల జాతర’ పకడ్బందీగా నిర్వహించాలి

‘పనుల జాతర’ పకడ్బందీగా నిర్వహించాలి

రాష్ట్ర పంచాయతీరాజ్‌

డిప్యూటీ కమిషనర్‌ జాన్‌ వెస్లీ

మోపాల్‌: గ్రామాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పనుల జాతర కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ డిప్యూ టీ కమిషనర్‌ జాన్‌ వెస్లీ సూచించారు. పనుల జాత ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని తాడెం గ్రామంలో శుక్రవారం అంగన్‌వాడీ భవన నిర్మాణానికి డీపీవో శ్రీనివాస్‌రావు, డీఎల్‌పీవో శ్రీనివాస్‌తో కలిసి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జాన్‌ వెస్లీ మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాల్లో ప్రగతి కోసం పనుల జాతర కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. కార్యక్రమంలో ఎంపీవో కిరణ్‌కుమార్‌, ఏపీవో సునీత, పంచాయతీ కార్యదర్శి మృదుల, జూనియర్‌ అసిస్టెంట్‌ భోజన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement