
అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం
నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది..పార్టీ పని అయిపోయిందని అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరుకోబోమని.. ఖబర్దార్ అని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి హెచ్చరించారు. బీజేపీ, బీఆర్ఎస్ లు ఒక్కటేనని కాంగ్రెస్ ప్రభుత్వం గురించి తెలియకుండా మాట్లాడితే వారికి తగిన గుణపాఠం చెబుతామని మండిపడ్డారు. ఆదివారం మండలంలోని రాంనగర్, శాస్త్రినగర్, శ్రీనగర్ గ్రామాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చిందన్నారు. కల్వాకుంట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఓడించినా సిగ్గురాలేదన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ చంద్రశేఖర్ గౌడ్, గుండారం సింగిల్ విండో చైర్మన్ దాసరి శ్రీధర్, మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాగిర్తి బాగారెడ్డి, అగ్గు భోజన్న, ఒడ్డెన్న, నగేష్, శ్రీనివాస్, మోహన్, రాంజేంద్ర ప్రసాద్, కిరణ్, రాజు, దత్తన్న, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్లు ఒక్కటే..
రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి